ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. గురువారం జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక స్థానాల్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గంగా గుంటూరు వెస్ట్ నిలిచింది. ఇంకా అనేక చోట్ల పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఆసక్తి నెలకొంది. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ తరపున మాదాల గిరి, వైసీపీ నుంచి ఏసురత్నం, జనసేన తరపున విశ్రాంత ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్, బీజేపీ నుంచి సినీ హీరోయిన్ మాధవీలత తదితరులు పోటీ చేస్తున్నారు. ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిపి మొత్తం 34 మంది బరిలో ఉన్నారు. దీని తర్వాత స్థానాల్లో మంగళగిరి(32), కర్నూలు(28), గుంటూరు ఈస్ట్(27) ఉన్నాయి. విజయవాడ వెస్ట్లో 22, చంద్రగిరిలో 22, కందుకూరులో 20, మదనపల్లెలో 19, బాపట్లలో 19, చిలకలూరిపేటలో 19, మైలవరంలో 18, విజయవాడ సెంట్రల్లో17 మంది బరిలో ఉన్నారు.
మరోవైపు ఇచ్ఛాపురం, కురుపాం, బొబ్బిలి, ఆముదాలవలసలో నుంచి కేవలం ఆరుగురు చొప్పున బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 9మంది, జగన్ నియోజకవర్గం పులివెందులలో 12మంది, జనసేన అధినేత పవన్ పోటీచేస్తున్న భీమవరంలో 13మంది, గాజువాకలో 12మంది బరిలో ఉన్నారు.
మరోవైపు ఇచ్ఛాపురం, కురుపాం, బొబ్బిలి, ఆముదాలవలసలో నుంచి కేవలం ఆరుగురు చొప్పున బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 9మంది, జగన్ నియోజకవర్గం పులివెందులలో 12మంది, జనసేన అధినేత పవన్ పోటీచేస్తున్న భీమవరంలో 13మంది, గాజువాకలో 12మంది బరిలో ఉన్నారు.