యాప్నగరం

Bhimavaram: భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమి.. గ్రంథికి మంత్రి పదవి ఖాయం!

తన సొంత జిల్లా పశ్చిమ గోదావరిలో జనసేన పార్టీకి ఊపు తేవడం కోసం పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేశారు. కానీ అనూహ్యంగా తన ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు.

Samayam Telugu 23 May 2019, 6:17 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాకతోపాటు భీమవరం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. తన సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకు ఊపు తేవడం కోసం ఆయన.. భీమవరం నుంచి పోటీ చేశారు. భీమవరంలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా పవన్ ఇక్కడి నుంచి పోటీకి దిగడానికి కారణమైందని వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఏపీ రాజకీయాల్లో భీమవరం హాట్ టాపిక్ అయ్యింది. కానీ అనూహ్యంగా ఆయన భీమవరంలో ఓటమిపాలయ్యారు.
Samayam Telugu pawan


3900 ఓట్ల తేడాతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్‌ను ఓడించారు. ఫ్యాన్ ప్రభంజనం కారణంగా గ్రంథి శ్రీనివాస్ జనసేనాని ఓడించారు. ఆరంభం నుంచి వెనుకంజలో ఉన్న పవన్.. మధ్యలో పుంజుకున్నప్పటికీ.. ఓడిపోక తప్పలేదు. భీమవరంలో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు, వైఎస్ఆర్సీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. పులవర్తి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండటంతో.. ఇక్కడ వైఎస్ఆర్సీపీ, జనసేనాని మధ్యే గట్టి పోటీ జరిగింది. భీమవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్.. లోకల్ హీరోకు, యాక్టర్ మధ్య పోరంటూ.. గ్రంథిని హీరో చేసేశారు. భీమవరంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరితే శీనన్నకు మంత్రి పదవి ఇస్తానన్నారు.

గ్రంథి గత ఎన్నికల్లో ఓడిపోవడం, 2009లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో.. సానుభూతి ఆయనకు కలిసొచ్చింది. ఓడినప్పటికీ గత ఐదేళ్లుగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం.. గ్రంథిని మంత్రి పదవి వరించే అవకాశాలున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.