యాప్నగరం

ఏపీకి మాయావతి.. పవన్‌తో కలిసి ప్రచారం, మూడు బహిరంగ సభలు

బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆమె బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జనసేన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Samayam Telugu 1 Apr 2019, 4:42 pm
బీఎస్పీ అధినేత్రి మాయావతి మంగళవారం ఆంధ్రప్రదేశ్ రానున్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆమె మంగళవారం రాత్రి విశాఖపట్నం చేరుకుంటారు. బుధవారం ఉదయం విశాఖపట్నంలో పవన్‌కళ్యాణ్‌‌తో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
Samayam Telugu mayawati


గురువారం తిరుపతిలో జరిగే భారీ బహిరంగ సభకి మాయావతి హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ స్టేడియంలో ఈ సభ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు పవన్‌కళ్యాణ్‌తో కలసి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో మాయావతి ప్రసంగిస్తారు.

ఎన్నికల్లో జనసేన, బీఎస్పీ, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మాయావతి నాయకత్వంలోని జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ సీట్లు కేటాయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.