ఏపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఫ్యాన్ గాలి బలంగా వీచింది. రాష్ట్రంలోని 151 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్కు పెట్టని కోట లాంటి రాయలసీమలో ఫ్యాన్ హైస్పీడ్లో తిరిగింది. సీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో టీడీపీ కేవలం మూడు సీట్లతో సరిపెట్టుకుంది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలుపొందగా.. హిందూపురంలో ఆయన బామ్మర్ది బాలయ్య గెలిచారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. రాయలసీమ జిల్లాల్లో మొత్తం 52 సీట్లు ఉండగా.. వైఎస్ఆర్సీపీ ఏకంగా 49 చోట్ల జెండా ఎగరేసింది. రాయలసీమ పొరుగునే ఉన్న నెల్లూరులోనూ జగన్ పార్టీదే హవా. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉండగా.. వైఎస్ఆర్సీపీ క్లీన్స్వీప్ చేసింది. రాయలసీమలోని 52 స్థానాలు ప్లస్ నెల్లూరులోని 10 స్థానాలు కలుపుకొని 62 స్థానాల్లో టీడీపీ 3 సీట్లతో సరిపెట్టుకుంది.
జగన్ సొంత జిల్లా కడపలో 10 స్థానాలు ఉండగా.. పదికి పది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. గతంలో రాజంపేటలో గెలిచిన టీడీపీ ఈసారి అక్కడ కూడా ఓడింది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి ఓటమిపాలయ్యారు. ఆదినారాయణ రెడ్డి వర్గం ఆయనతో చేతులు కలిపినప్పటికీ.. ఫలితం లేకపోయింది.
గత ఎన్నికల తరహాలోనే కర్నూలు జిల్లాలో జగన్ హవా కనిపిస్తోంది. 14 స్థానాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపించింది. కోట్ల, కేఈ ఫ్యామిలీలు కూడా ఇక్కడ చతికిలపడ్డాయి.
2014లో అనంతపురం జిల్లా టీడీపీకి 12 సీట్లు కట్టబెట్టింది. కానీ ఈసారి ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. 2019లో ఆ జిల్లా ఓటర్లు వైఎస్ఆర్సీపీకి 12 స్థానాలు కట్టబెట్టారు. హిందూపురం, ఉరవకొండల్లోనే టీడీపీ గెలిచింది.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనూ టీడీపీకి షాక్ తగిలింది. కుప్పం మినహా మిగతా 13 చోట్ల టీడీపీ ఓడిపోయింది. మొత్తంగా రాయలసీమలో 3 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
జగన్ సొంత జిల్లా కడపలో 10 స్థానాలు ఉండగా.. పదికి పది స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సత్తా చాటింది. గతంలో రాజంపేటలో గెలిచిన టీడీపీ ఈసారి అక్కడ కూడా ఓడింది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి ఓటమిపాలయ్యారు. ఆదినారాయణ రెడ్డి వర్గం ఆయనతో చేతులు కలిపినప్పటికీ.. ఫలితం లేకపోయింది.
గత ఎన్నికల తరహాలోనే కర్నూలు జిల్లాలో జగన్ హవా కనిపిస్తోంది. 14 స్థానాల్లోనూ ఫ్యాన్ ప్రభంజనం కనిపించింది. కోట్ల, కేఈ ఫ్యామిలీలు కూడా ఇక్కడ చతికిలపడ్డాయి.
2014లో అనంతపురం జిల్లా టీడీపీకి 12 సీట్లు కట్టబెట్టింది. కానీ ఈసారి ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. 2019లో ఆ జిల్లా ఓటర్లు వైఎస్ఆర్సీపీకి 12 స్థానాలు కట్టబెట్టారు. హిందూపురం, ఉరవకొండల్లోనే టీడీపీ గెలిచింది.
ఇక సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోనూ టీడీపీకి షాక్ తగిలింది. కుప్పం మినహా మిగతా 13 చోట్ల టీడీపీ ఓడిపోయింది. మొత్తంగా రాయలసీమలో 3 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.