యాప్నగరం

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి 2014లో ఏం చెప్పారు? అంచనాలు నిజమయ్యాయా?

ఏపీ ఎన్నికలపై లగడపాటి సర్వే ఫలితాలు నిజమవుతాయా? 2014 ఎన్నికల్లో ఆయన ఏం చెప్పారు? ఆయన అంచనాలు నిజమయ్యాయా?

Samayam Telugu 19 May 2019, 7:48 am
తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో లగడపాటి రాజగోపాల్ అంచనాలు ఎప్పుడైతే తారుమారయ్యయో అప్పటి నుంచి ఆయన సర్వేలపై సందేహాలు నెలకొన్నాయి. సర్వేలు చేయడం తనకు వ్యసనం అని చెబుతున్న లగడపాటి గతంలో చెప్పిన అంచనాలు దాదాపు నిజమే అయ్యాయి. మరి 2014 ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆయన అంచనాలు నిజమయ్యాయా?
Samayam Telugu 01D9E


ఏపీ విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకున్న రాజగోపాల్ 2014లో ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వే చేశారు. ఈ సందర్భంగా ఏపీలోని మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ-బీజేపీ కూటమికి 115 నుంచి 125 సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేశారు. వైస్సార్‌సీపీకి 45 నుంచి 55 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొన్నారు. 25 లోక్‌సభ స్థానాలకుగాను టీడీపీ-బీజేపీ కూటమికి 19-22 సీట్లు లభిస్తాయని అంచనా వేశారు.

ఫలితాల్లో లగడపాటి అంచనాలకు తగినట్లుగానే టీడీపీ-బీజేపీ కూటమి 107 సీట్లు, వైఎస్సార్‌సీపీకి 66 సీట్లు లభించాయి. లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి 16, వైఎస్సార్ సీపీకి 9 స్థానాలు దక్కాయి. అయితే, 2018 తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను పూర్తిగా విరుద్ధంగా చెప్పడంతో ఈసారి ఆయన జోస్యంపై అనుమానాలు నెలకొన్నాయి. పైగా, ఈసారి ఫలితాలు అంచనాలకు అందని విధంగా ఉండటంతో ఓటరు నాడిని పట్టుకోవడం కష్టంగా ఉంది. మరి, ఆదివారం తుది విడత పోలింగ్ పూర్తికాగానే వెల్లడయ్యే లగడపాటి ఇతరాత్ర సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏవిధంగా ఉండబోతాయనే ఆసక్తి నెలకొంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.