ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పరిస్థితి ఘోరంగా ఉంది. చివరికి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తారా లేదా అనే పరిస్థితిలో ట్రెండ్ కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో పవన్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. అయితే, గాజువాకలో స్వల్ప ఆధిక్యంతో కొనసాగిన పవన్ ఐదో రౌండు ముగిసేసరికి వెనుకంజలో ఉన్నారు. వైసీసీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి పవన్పై ఆధిక్యత కొనసాగిస్తుండగా.. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు మూడో స్థానంలో ఉన్నారు. ఫలితాల్లో జనసేనకు ఒక్క సీటులో కూడా ఆధిక్యతలో లేకపోవడం గమనార్హం. దీంతో జనసేన కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. అయితే, గాజువాకలో మాత్రం ఆధిక్యం ప్రతి రౌండ్కు మారుతోంది. పవన్.. తిప్పల మధ్య ఆధిక్యత దోబూచులాడుతోంది.
Janasena Seats: రెండు స్థానాల్లో పవన్ వెనుకంజ, గాజువాకలో నువ్వా నేనా!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో వెనుకబడ్డారు. గాజువాకలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
Samayam Telugu 23 May 2019, 1:16 pm