యాప్నగరం

ఛత్తీస్‌గఢ్‌: సాయంత్రం 6వరకు 72 శాతం పోలింగ్‌​

19 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కవార్దాలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.

Samayam Telugu 20 Nov 2018, 8:08 pm
ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ పోలింగ్‌లో సాయంత్రం 6 గంటలవరకు దాదాపు 72 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 45శాతం శాతం ఉన్న పోలింగ్‌ సాయంత్రానికి మరింత పెరిగిందని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పారు. రాత్రివరకల్లా మొత్తం పోలింగ్‌ శాతం తెలుస్తుందన్నారు. రెండో విడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Samayam Telugu Chhattisgarh Polls


శాసనసభ స్పీకర్‌, తొమ్మిది మంది మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బూపేష్‌ భగేల్‌, కాంగ్రెస్‌ నుంచి సీఎం రేసులో ఉన్న చరణ్‌దాస్‌ మహంత్‌, టీఎస్‌ సింగ్‌దేవ్‌, జేసీసీ అధ్యక్షుడు అజిత్‌జోగి, ఆయన సతీమణి రేణు జోగి తదితరులున్నారు. మావోయిస్టు ప్రభావిత 18 నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన తొలి దశ ఎన్నికల్లో 76.28శాతం ఓట్లు పోలయ్యాయి. నేడు రెండో దశలో 19 జిల్లాల్లోని 72 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరిగింది. మొత్తం 1,079 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బరిలో ఉన్నారు. 19 వేలకు పైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ కవార్దాలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటేశారు.

గత 15ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి విజయం సాధిస్తామని ధీమాగా ఉండగా, తమ కూటమి విజయం సాధిస్తుందని అజిత్‌ జోగి, మాయావతి చెబుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సైతం 66 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. నేటితో ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 శాసనసభ స్థానాలకు పోలింగ్‌ ముగుస్తుంది. ఎన్నికలు జరుగుతున్న మరో నాలుగు రాష్ట్రాలతో పాటు డిసెంబరు 11న ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.