మావోయిస్టులను బూచీగా చూపుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఓవైపు పట్టణ మావోయిస్టులను కాపాడుతూనే మరోవైపు రాష్ట్రానికి మావోయిస్టుల నుంచి విముక్తి కల్పిస్తామంటూ ఆ పార్టీ చెప్పడం హాస్యాస్పదం అని దుయ్యబట్టారు. ఛత్తీస్గఢ్లోని జగ్దల్పూర్లో శుక్రవారం (నవంబర్ 9) ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు.
‘పట్టణ మావోయిస్టులు ఏసీ గదుల్లో నివసిస్తారు. ఖరీదైన కార్లలో తిరుగుతారు. వారి పిల్లలను విదేశాల్లో చదివిస్తారు. అలాంటి వారు రిమోట్ కంట్రోల్తో మన నిరుపేద ఆదివాసీల జీవితాలను శాసిస్తున్నారు. వారి జీవనాన్ని నాశనం చేస్తున్నారు. అలాంటి పట్టణ మావోయిస్టులకు కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోంది? పైగా.. మావోలను రక్షిస్తూనే, రాష్ట్రంలో మావోలు లేకుండా చేస్తామని చెబుతోంది. ఇలాంటి పార్టీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలి’ అని మోదీ అన్నారు.
బడుగు, బలహీన వర్గాలు, దళితులను కాంగ్రెస్ పార్టీ మనుషులుగా ఎప్పుడూ చూడలేదని, వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉందని, కానీ ఛత్తీస్గఢ్ అభివృద్ధిపై ఎన్నడూ దృష్టిపెట్టలేదని విమర్శించారు.
‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ మా పార్టీ నినాదం. కులం, మతం పేరుతో మేం ఎవరిపైనా వివక్ష చూపలేదు. ఛత్తీస్గఢ్ను త్వరలోనే సంపన్న రాష్ట్రంగా మారుస్తాం. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలోనూ అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని మోదీ అన్నారు.
ఆ కుట్ర ఉదంతం వెలుగులోకి వచ్చిన నాటి నుంచే..
మోదీపై హత్యకు మావోలు కుట్ర పన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పుణే పోలీసులు దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో దాడులు చేసి పలువురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. వీరిలో వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్లేఖ, అరుణ్ ఫెర్రైరా, వెర్నన్ గోన్సాల్వ్స్ ఉన్నారు. వీరి అరెస్టుకు నిరసనగా ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వీరికి కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతిచ్చాయి.
మహారాష్ట్రలోని భీమా-కొరెగాంలో జనవరి 1న జరిగిన హింసకు సంబంధించి దళిత నేత సుధీర్ ధార్వాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, పౌర హక్కుల నేత రోనా విల్సన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలోనే మోదీ హత్య కుట్ర బయటపడింది. రోనా విల్సన్ నివాసంలో లభించిన లేఖలో మోదీ హత్యకు కుట్ర విషయం ఉంది. కామ్రేడ్ ప్రకాష్ అనే వ్యక్తికి ఆర్ అనే పేరుతో వచ్చిన లేఖను విల్సన్ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2017 ఏప్రిల్ 18న రాసిన లేఖ అది. ప్రధాని రోడ్ షోలు నిర్వహించే సమయంలో ఆయణ్ని హత్య చేయాలనేది కుట్రగా పోలీసులు తెలిపారు.
వేడెక్కిన ప్రచారం.. ఒకే రోజు ఇద్దరు నేతలు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాలు చేపట్టారు. ఒకే రోజు వీరిద్దరూ రాష్ట్రంలో పర్యటిస్తూ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఛత్తిస్గఢ్లోని మొత్తం 90 నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం (నవంబరు 12) జరిగే పోలింగ్లో 18 అసెంబ్లీ స్థానాలకు, నవంబరు 20న జరిగే పోలింగ్లో 72 స్థానాలకు ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11న ఫలితాలు వెలువడుతాయి.
‘పట్టణ మావోయిస్టులు ఏసీ గదుల్లో నివసిస్తారు. ఖరీదైన కార్లలో తిరుగుతారు. వారి పిల్లలను విదేశాల్లో చదివిస్తారు. అలాంటి వారు రిమోట్ కంట్రోల్తో మన నిరుపేద ఆదివాసీల జీవితాలను శాసిస్తున్నారు. వారి జీవనాన్ని నాశనం చేస్తున్నారు. అలాంటి పట్టణ మావోయిస్టులకు కాంగ్రెస్ ఎందుకు మద్దతిస్తోంది? పైగా.. మావోలను రక్షిస్తూనే, రాష్ట్రంలో మావోలు లేకుండా చేస్తామని చెబుతోంది. ఇలాంటి పార్టీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలి’ అని మోదీ అన్నారు.
బడుగు, బలహీన వర్గాలు, దళితులను కాంగ్రెస్ పార్టీ మనుషులుగా ఎప్పుడూ చూడలేదని, వారిని ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పదేళ్లపాటు కేంద్రంలో అధికారంలో ఉందని, కానీ ఛత్తీస్గఢ్ అభివృద్ధిపై ఎన్నడూ దృష్టిపెట్టలేదని విమర్శించారు.
‘సబ్కా సాథ్, సబ్కా వికాస్ మా పార్టీ నినాదం. కులం, మతం పేరుతో మేం ఎవరిపైనా వివక్ష చూపలేదు. ఛత్తీస్గఢ్ను త్వరలోనే సంపన్న రాష్ట్రంగా మారుస్తాం. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలోనూ అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని మోదీ అన్నారు.
ఆ కుట్ర ఉదంతం వెలుగులోకి వచ్చిన నాటి నుంచే..
మోదీపై హత్యకు మావోలు కుట్ర పన్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. పుణే పోలీసులు దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లో దాడులు చేసి పలువురు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్టు చేశారు. వీరిలో వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్లేఖ, అరుణ్ ఫెర్రైరా, వెర్నన్ గోన్సాల్వ్స్ ఉన్నారు. వీరి అరెస్టుకు నిరసనగా ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వీరికి కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు మద్దతిచ్చాయి.
మహారాష్ట్రలోని భీమా-కొరెగాంలో జనవరి 1న జరిగిన హింసకు సంబంధించి దళిత నేత సుధీర్ ధార్వాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, మహేశ్ రౌత్, షోమా సేన్, పౌర హక్కుల నేత రోనా విల్సన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి మావోయిస్టులతో సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలోనే మోదీ హత్య కుట్ర బయటపడింది. రోనా విల్సన్ నివాసంలో లభించిన లేఖలో మోదీ హత్యకు కుట్ర విషయం ఉంది. కామ్రేడ్ ప్రకాష్ అనే వ్యక్తికి ఆర్ అనే పేరుతో వచ్చిన లేఖను విల్సన్ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2017 ఏప్రిల్ 18న రాసిన లేఖ అది. ప్రధాని రోడ్ షోలు నిర్వహించే సమయంలో ఆయణ్ని హత్య చేయాలనేది కుట్రగా పోలీసులు తెలిపారు.
వేడెక్కిన ప్రచారం.. ఒకే రోజు ఇద్దరు నేతలు
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్గఢ్లో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాలు చేపట్టారు. ఒకే రోజు వీరిద్దరూ రాష్ట్రంలో పర్యటిస్తూ పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు.
ఛత్తిస్గఢ్లోని మొత్తం 90 నియోజకవర్గాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సోమవారం (నవంబరు 12) జరిగే పోలింగ్లో 18 అసెంబ్లీ స్థానాలకు, నవంబరు 20న జరిగే పోలింగ్లో 72 స్థానాలకు ఎన్నికలు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 11న ఫలితాలు వెలువడుతాయి.