Gujarat Election Phase 2 గుజరాత్ శాసనసభ ఎన్నికలు (Gujarat Assembly Election 2022) తుది అంకానికి చేరుకున్నాయి. 14 జిల్లాల పరిధిలోని 93 నియోజకవర్గాల్లో సోమవారం తుది విడత పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖ పోరు దేశం మొత్తం ఆసక్తి రేపుతోంది. 27 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతోన్న కమలనాథులు.. ఈసారి అత్యధిక సీట్లు గెలుచుకొని చరిత్ర తిరగరాయాలనే కృతనిశ్చయంతో ప్రచారం సాగించారు. అటు, పూర్వ వైభవం కోసం కాంగ్రెస్, సత్తా చాటాలని ఆప్ తీవ్రంగా శ్రమించాయి. ఉత్తర గుజరాత్లో తుది దశ పోలింగ్ జరుగుతుండగా.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా బీజేపీ తక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 93 సీట్లకు గాను 2017 ఎన్నికల్లో బీజేపీ 51, కాంగ్రెస్ 39, స్వతంత్రులు మూడు చోట్ల విజయం సాధించారు. వీటిలో సెంట్రల్ గుజరాత్లో బీజేపీ అధిక సీట్లు సాధించినా.. నార్త్ గుజరాత్లో మాత్రం కాంగ్రెస్ సత్తా చాటింది. సెంట్రల్ గుజరాత్లో బీజేపీ 37, కాంగ్రెస్ 22 సీట్లు గెలుచుకోగా.. ఉత్తర గుజరాత్లో కాంగ్రెస్ 17, కాషాయ పార్టీ 14 సీట్లను దక్కించుకుంది.
మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి.. డిసెంబర్ 1న తొలి విడతలో 89 సీట్లకు పోలింగ్ జరిగింది. ఓటర్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కేవలం 63.31 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్లతో కలిపి 61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 2.51కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుషులు, 1.22కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే 18 నుంచి 19ఏళ్ల యువ ఓటర్లు 5.96లక్షల మంది ఉండటం గమనార్హం.
రెండో దశ కోసం 14,975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1.13లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. అలాగే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఘట్లోడియా నుంచి సీఎం భూపేంద్ర పటేల్, వీరామ్గామ్ నుంచి పాటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి అల్పేశ్ ఠాకూర్ బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు. ప్రముఖ దళిత ఉద్యమ నేత జిగ్నేశ్ మేవానీ వాద్గామ్, గుజరాత్ ప్రతిపక్ష నేత సుఖరామ్ రాట్వా జెట్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
మరోవైపు, రెండో దశలో పోలింగ్ జరుగుతోన్న అహ్మదాబాద్ నగరంలోని 16 సీట్లు బీజేపీకి కీలకం కానున్నాయి. 1990 నుంచి కాషాయ పార్టీ ఆధిపత్యం ఈ నగరంపై అప్రతిహతంగా కొనసాగుతోంది. 2012 ఎన్నికల్లో రెండు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్.. 2017లో నాలుగుకు పెంచుకోగలిగింది. మిగిలిన 12 కూడా బీజేపీ ఖాతాలో చేరాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ఆప్ కూడా బరిలో ఉండటంతో ఎవరికి ఎన్నిసీట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా గుజరాత్లో క్రమంగా పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. 2012లో 69.3 శాతం ఓటింగ్ నమోదుకాగా.. 2017లో 67 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం తొలి దశలో 63.31 శాతం మాత్రమే నమోదుకాగా.. రెండో దశలో ఏ మేరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తారనేది ఆసక్తింగా మారింది. రెండో దశ పోలింగ్ జరుగుతోన్న సీట్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉండటంతో ఓటుకున్న విలువేంటో తెలుసని, ఓటేయడానికి ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు.
Read Latest National News And Telugu News
మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి.. డిసెంబర్ 1న తొలి విడతలో 89 సీట్లకు పోలింగ్ జరిగింది. ఓటర్ల పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కేవలం 63.31 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్లతో కలిపి 61 పార్టీల నుంచి మొత్తంగా 833 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 2.51కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 1.29 కోట్ల మంది పురుషులు, 1.22కోట్ల మంది మహిళలు ఉన్నారు. అలాగే 18 నుంచి 19ఏళ్ల యువ ఓటర్లు 5.96లక్షల మంది ఉండటం గమనార్హం.
రెండో దశ కోసం 14,975 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 1.13లక్షల మంది పోలింగ్ సిబ్బందిని మోహరించారు. అలాగే, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఘట్లోడియా నుంచి సీఎం భూపేంద్ర పటేల్, వీరామ్గామ్ నుంచి పాటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్, గాంధీనగర్ సౌత్ నుంచి అల్పేశ్ ఠాకూర్ బీజేపీ అభ్యర్థులుగా ఉన్నారు. ప్రముఖ దళిత ఉద్యమ నేత జిగ్నేశ్ మేవానీ వాద్గామ్, గుజరాత్ ప్రతిపక్ష నేత సుఖరామ్ రాట్వా జెట్పూర్ నుంచి పోటీ చేస్తున్నారు.
మరోవైపు, రెండో దశలో పోలింగ్ జరుగుతోన్న అహ్మదాబాద్ నగరంలోని 16 సీట్లు బీజేపీకి కీలకం కానున్నాయి. 1990 నుంచి కాషాయ పార్టీ ఆధిపత్యం ఈ నగరంపై అప్రతిహతంగా కొనసాగుతోంది. 2012 ఎన్నికల్లో రెండు సీట్లు దక్కించుకున్న కాంగ్రెస్.. 2017లో నాలుగుకు పెంచుకోగలిగింది. మిగిలిన 12 కూడా బీజేపీ ఖాతాలో చేరాయి. ఈసారి బీజేపీ, కాంగ్రెస్లతో పాటు ఆప్ కూడా బరిలో ఉండటంతో ఎవరికి ఎన్నిసీట్లు వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా గుజరాత్లో క్రమంగా పోలింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. 2012లో 69.3 శాతం ఓటింగ్ నమోదుకాగా.. 2017లో 67 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం తొలి దశలో 63.31 శాతం మాత్రమే నమోదుకాగా.. రెండో దశలో ఏ మేరకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తారనేది ఆసక్తింగా మారింది. రెండో దశ పోలింగ్ జరుగుతోన్న సీట్లు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లో ఉండటంతో ఓటుకున్న విలువేంటో తెలుసని, ఓటేయడానికి ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు.
Read Latest National News And Telugu News