యాప్నగరం

Gujarat Elections: బీజేపీలో అసమ్మతి సెగలు... ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలుపు... రెబల్‌గా పోటీ

గుజరాత్‌లో ఎన్నికల (Gujarat Elections) వాతావరణం నెలకొంది. బీజేపీ 160 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. అయితే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించలేదు. దాంతో రాష్ట్రంలో రెబల్ అభ్యర్థులు ఎక్కువగా పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు బీజేపీ పార్టీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుభాయ్ శ్రీవాస్తవ్‌ టికెట్ కేటాయించలేదు. దాంతో ఆయన తిరుగుబావుటా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సవాల్ విసిరారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 14 Nov 2022, 7:40 pm

ప్రధానాంశాలు:

  • గుజరాత్‌లో ఎన్నికల వేడి
  • 160 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా
  • సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ కేటాయించని వైనం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Gujarat Assembly elections
Gujarat Elections: గుజరాత్ (Gujarat) బీజేపీలో (BJP) అసమ్మతి రాజుకుంది. బీజేపీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి.. ఆ పార్టీపై రెబల్‌ జెండా ఎగురవేశాడు. ప్రస్తుతం బీజేపీ రెబల్‌గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. వాఘోడియా నియోజకవర్గం సిట్టింగ్‌ బీజేపీ ఎమ్మెల్యే మధుభాయ్ శ్రీవాస్తవ్‌కు ఆ పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దాంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
1995లో గుజరాత్ బీజేపీ నాయకులైన నరేంద్ర మోదీ, అమిత్ షా కోరడంతోనే ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా గెలిచిన తాను బీజేపీలో చేరాననిన శ్రీవాస్తవ్‌ చెప్పారు. తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఐదు సార్లు పోటీ చేసి.. గెలిచానని అన్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం తనకు టికెట్‌ ఇవ్వలేదని విమర్శించారు. అంతేకాకుండా తన స్థానంలో టికెట్ కేటాయించిన వడోదర జిల్లా బీజేపీ చీఫ్ అశ్విన్ పటేల్, స్థానిక ఎన్నికల్లో ఎప్పుడూ గెలవలేదని శ్రీ వాస్తవ తెలిపారు. తనకు టికెట్ నిరాకరించడంపై పార్టీపై కోపం వచ్చిందని, ఆ పార్టీలో అన్ని పదవులను వదులకుంటున్నాని మీడియాకు శ్రీ వాస్తవ్ చెప్పారు.

తాను బీజేపీ నేతలు కోరితేనే... పార్టీలోకి వచ్చానని, నరేంద్ర మోదీ, అమిత్ షా‌తో నేరుగా మాట్లాడే అవకాశం ఉందని మధుభాయ్ శ్రీవాస్తవ్ అన్నారు. తనకు టికెట్ నిరాకరించినందుకు వారితో మాట్లాడబోనని చెప్పారు. మరోవైపు గుజరాత్‌లో బీజేపీ 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. అయితే ఐదుగురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్‌తో సహా 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ కేటాయించ లేదు. దీంతో గుజరాత్‌లో పెద్ద సంఖ్యలో రెబల్ అభ్యర్థులు పోటీ చేయవచ్చని తెలుస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.