యాప్నగరం

నాలుగో దశలో 56.58శాతం పోలింగ్

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నాలుగు దశల పోలింగ్ ముగిసింది. చివరిదైన అయిదో దశ ఎన్నికలు డిసెంబర్ 20న నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Samayam Telugu 17 Dec 2019, 12:26 pm
జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సోమవారం (డిసెంబర్ 16న) నాలుగవ విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ దశ పోలింగ్‌లో 56.58 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి తొలి మూడు దశల్లో 50 స్థానాలకు ఎన్నికలు జరగగా, నాలుగో దశలో 15 స్థానాలకు ఎన్నిక జరిగింది. చివరిదైన ఐదో దశ పోలింగ్ డిసెంబర్ 20న 16 స్థానాలకు జరగనుంది. ఈ నెల 23న ఫలితాలు వెలువడనున్నాయి.
Samayam Telugu Jharkhand


సమస్యాత్మక జమునా, గిరిధ్, తుండి, బగోడర్, దుమ్రి నియోజకవర్గాల్లో భద్రతా కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ పూర్తయింది. మిగతా స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం వరకు నమోదైన పోలింగ్ చూసి భారీగా పోలింగ్ నమోదుకావచ్చునని అధికారులు భావించారు. కానీ నాలుగో దశలో ఓ మోస్తరు పోలింగ్ నమోదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.