యాప్నగరం

Jharkhand Polls: జార్ఖండ్ ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి!

ప్రజాస్వామ్య పండుగలో జార్ఖండ్ ఓటర్లు భాగస్వాములు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

Samayam Telugu 16 Dec 2019, 2:12 pm
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు (డిసెంబర్ 16న) నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నాలుగో విడతలో 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 221 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జమునా, గిరిధ్, తుండి, బగోడర్, దుమ్రి నియోజకవర్గాల్లో భద్రతా కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. నిర్ణీత సమయానికి పోలింగ్ కేంద్రానికి చేకున్న వారు సైతం ఓటు వేసేందుకు అనుమతి ఉంటుంది.
Samayam Telugu Narendra Modi


నేడు జరుగుతున్న జార్ఖండ్ నాలుగో దశ పోలింగ్‌లో భాగస్వాములు కావాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఓటు వేయడం ద్వారా ముఖ్యమైన ప్రజాస్వామ్య పండుగను జరుపుకోవాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఓటింగ్‌లో పాల్గొనాలని జార్ఖండ్ ప్రజలకు పిలుపునిస్తూ ట్వీట్ చేశారు.

మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఐదు దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదివరకే మూడు దశల పోలింగ్‌లో 50 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 20న 16 స్థానాలకు పోలింగ్‌తో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక ముగియనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.