యాప్నగరం

Jharkhand Elections: పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు

జార్ఖండ్‌లో జరుగుతున్న నాలుగో దశ పోలింగ్‌లో రికార్డు ఓటింగ్ నమోదవుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 44.74శాతం ఓటింగ్ నమోదైంది.

Samayam Telugu 16 Dec 2019, 4:19 pm
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.74శాతం ఓటింగ్ నమోదైదనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ మేరకు ఏఎన్ఐ తమ ట్వీట్టర్లో పోలింగ్ అప్ డేట్ అందించింది. జమునా, బగోడర్, దుమ్రి, గిరిధ్, తుండి, నియోజకవర్గాల్లో భద్రతా కారణాల వల్ల మధ్యాహ్నం 3 గంటల వరకే నిర్వహిస్తారు. ఇతర నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతోంది.
Samayam Telugu record voter turnout till 1pm in jharkhand fourth phase polling
Jharkhand Elections: పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు


కాగా, నేటి పోలింగ్‌లో మొత్తం 47,85,009 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ దశలో జార్ఖండ్ రెవెన్యూశాఖ మంత్రి అమర్ కుమార్ జౌరీ, కార్మికశాఖ మంత్రి రాజ్ పాలివార్ కీలక అభ్యర్థులుగా ఉన్నారు. అయితే జార్ఖండ్ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగలో పాల్గోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి ఐదు దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నేడు 15 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 20న 16 స్థానాలకు పోలింగ్‌తో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నిక ముగియనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.