యాప్నగరం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట విషాదం

Siddaramaiah Brother In Law Death News కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ ఉత్సాహంలో ఉంది. ఆ పార్టీ శ్రేణులు.. సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఇంట్లో విషాదం నెలకొంది. సిద్ధరామయ్య సోదరి శివమ్మ భర్త రామేగౌడ మరణించారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ కొద్దిసేపటికే కన్నమూశారు. దీంతో సిద్ధరామయ్య కుటుంబం విషాదంలో ఉంది. సాయంత్రం రామేగౌడ అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు.

Authored byతిరుమల బాబు | Samayam Telugu 13 May 2023, 2:00 pm

ప్రధానాంశాలు:

  • మాజీ సీఎం సిద్ధ రామయ్య ఇంట విషాదం
  • సిద్ధరామయ్య సోదరి భర్త కన్నుమూశారు
  • సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Siddaramaiah Brother In Law Ramegowda
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Karnataka Election Results) కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఆ పార్టీ అభ్యర్థులు మెజార్టీల్లో కొనసాగుతున్నారు. 120పైగా స్థానాల్లో గెలుస్తామని కాంగ్రెస్ ధీమాను వ్యక్తం చేస్తోంది. ఓవైపు కాంగ్రెస్ సంబరాల్లో ఉంటే.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరి శివమ్మ భర్త రామేగౌడ (Rame Gowda ) కన్నుమూశారు.. శనివారం ఉదయం గౌడ అస్వస్థతకు గురికావడంతో హుటాహుటిన మైసూరులో ఆష్పత్రికి తరలించారు. అయితే కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు.. రామేగౌడ మరణంతో సిద్ధరామయ్య కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. రామేగౌడకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సాయంత్రం సిద్ధరామనహుండిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు సిద్ధ రామయ్య. 120 స్థానాలకుపైగా గెలుస్తామని.. బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని.. కాంగ్రెస్ పార్టీకి ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. కర్ణాటకలో మత రాజకీయాలు పనిచేయలేదని కామెంట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండటంతో.. అప్పుడే కన్నడ సీఎం ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలో సిద్ధ రామయ్య కుమారుడు యతీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని.. స్పష్టమైన మెజార్టీ వస్తుందన్నారు. అలాగే ఒక అడుగు ముందుకేసి.. తన తండ్రి సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రిని ముఖ్యమంత్రిగా చూడాలనే ఆశ కుమారుడిగా తనకు ఉందన్నారు. గతంలో ఆయన అందించిన సుపరిపాలన కచ్చితంగా సీఎంగా కూర్చోబెడుతుందని ఆకాంక్షించారు. బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సిద్ధరామయ్య మళ్లీ పాలనను గాడి పెడతారని ప్రజల్లో నమ్మకం ఉందన్నారు. సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా చూడాలని కన్నడ ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే సిద్ధ రామయ్య వరుణ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కనకపుర నుంచి ఘన విజయం సాధించారు. అలాగే షిగ్గావ్ నుంచి బసవరాజ్ బొమ్మై విజయం సాధించారు.. బళ్లారి రూరల్ నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీరాములు ఓడిపోయారు. రామనగర నుంచి పోటీ చేసిన కుమారస్వామి కుమారుడు నిఖిల్ ఓటమిపాలయ్యారు. గంగావతిలో గాలి జనార్థన్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలకు మించి కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.

రచయిత గురించి
తిరుమల బాబు
తిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.