యాప్నగరం

Karnataka Elections: 'లింగాయత్' నేతలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లింగాయత్ నేతల గురించి జోరుగా చర్చ జరుగుతోంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి శెట్టర్.. బీజేపీని వీడటంతో.. ఆ చర్చ ఇంకా పెరిగింది. ఇన్నాళ్లు లింగాయత్‌లు బీజేపీ వెనక ర్యాలీ అయ్యేవారన్న టాక్ ఉంది. ఇప్పుడు ఆ సామాజికవర్గం నేతలు వరుసగా పార్టీకి రాంరాం చెబుతున్నారు. దీంతో లింగాయత్‌లపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. వారిపై తమకున్న ప్రేమను చాటుకునేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ గట్టిగా ప్రయత్నిస్తోంది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 16 Apr 2023, 2:50 pm

ప్రధానాంశాలు:

  • లింగాయత్ నేతలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్
  • బీజేపీని వీడుతున్న సీనియర్ నేతలు
  • లింగాయత్‌లపై ప్రేమను చాటుతున్న కాంగ్రెస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Jagdish Shettar
జగదీష్ శెట్టర్
Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలోని లింగాయత్ నేతలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రలు చేస్తున్నారని.. కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. యడియూరప్ప, లక్ష్మణ్ సవాడి, శెట్టర్‌ (Jagdish Shettar) వంటి ప్రముఖ లింగాయత్‌ నేతలను బీజేపీ అవమానించిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్ పార్టీని వీడుతున్నారు. దీంతో మరో ప్రముఖ లింగాయత్ నేత బీజేపీకి దూరమయ్యారు. శెట్టర్ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరబోతున్నారు. లక్ష్మణ్ సవాడి తర్వాత ఉత్తర కర్ణాటకకు చెందిన మరో బలమైన నేత కాంగ్రెస్‌లో చేరనుండటంతో.. కాంగ్రెస్ (Karnataka Congress) పార్టీలో జోష్ పెరుగుతోంది.

అయితే.. మోదీ-షా ద్వయం కుతంత్రాల వల్లే బీఎస్ యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. అలాగే.. సవాడి, షెట్టర్, ఇతర లింగాయత్‌లను బీజేపీ టార్గెట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. బీఎస్ యడ్యూరప్పను బీజేపీ హైకమాండ్ కంటతడి పెట్టించిందని.. ఇప్పుడు సవాడి, శెట్టర్ వంతు వచ్చిందని.. రానున్న రోజుల్లో మరింత మంది లింగాయత్ నేతలను అవమానించే యోచనలో బీజేపీ (BJP) ఉందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

ఇటు జగదీష్ శెట్టర్ ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. స్పీకర్ కాగేరికి తన రాజీనామా లేఖను సమర్పించారు. హుబ్లీ నుంచి ప్రత్యేక విమానంలో శెట్టర్ బెంగళూరు వెళ్లనున్నారని.. ఆయన కోసం కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) స్వయంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారని ప్రచారం జరుగుతోంది.

జగదీష్ షెట్టర్ బీజేపీని వీడడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప. తనకు అన్నీ ఇచ్చిన పార్టీకి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. షెట్టర్‌ను ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రతిపక్ష నేతగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిని చేసింది బీజేపీ పార్టీనే అని (B. S. Yediyurappa) స్పష్టం చేశారు. ఇప్పుడు అధికార కాంక్షతో పార్టీని వీడిన జగదీష్ శెట్టర్‌ను ప్రజలు క్షమించబోరని వ్యాఖ్యానించారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.