యాప్నగరం

Shiggaon: బసవరాజ్ బొమ్మై కోసం.. డీకే శివకుమార్ అభ్యర్థిని మార్చారా?

Shiggaon: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలోని ముఖ్యమైన నియోజకవర్గాలు, ముఖ్యమైన అభ్యర్థుల గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే.. పలు చోట్ల ప్రత్యర్థుల గెలుపు కోసం ప్రధాన పార్టీల నేతలు కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం బొమ్మై గెలుపు కోసం.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అభ్యర్థిని మార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాటిపై డీకే ఘాటుగా స్పందించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 20 Apr 2023, 5:05 pm

ప్రధానాంశాలు:

  • కర్నాటకలో పెరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫీవర్
  • ముఖ్యమైన అభ్యర్థుల గురించి జోరుగా చర్చలు
  • బొమ్మై కోసం డీకే శివకుమార్ అభ్యర్థిని మార్చారని టాక్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Bommai, DKS
బొమ్మై వర్సెస్ డీకే
Shiggaon: షిగ్గావ్ శాసనసభ నియోజకవర్గానికి.. కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థిని మార్చడంతో.. సీఎం బసవరాజ బొమ్మై గెలుపు కోసం కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని.. తీవ్ర ఆరోపణలు వచ్చాయి. షిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పోటీ చేస్తుండగా.. ఆయన గెలుపు కోసం కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థిని మార్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ఆరోపణలను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar) ఖండించారు.
షికారిపుర నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడ్యూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర గెలుపు కోసం.. కాంగ్రెస్‌ బలహీన అభ్యర్థిని బరిలోకి దింపిందని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు హవేరి జిల్లా షిగ్గావ్ నియోజకవర్గంలోనూ ఇదే ఆరోపణ వినిపిస్తోంది. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సవనూరు బరిలో నిలిచారు. అయితే.. పార్టీ విడుదల చేసిన ఐదో జాబితాలో సవనూరును తప్పించి.. యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌కు టిక్కెట్టు ఇచ్చారు.
దీంతో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గెలుపు కోసం కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గెలుపు అవకాశాలను పునః పరిశీలించిన తర్వాతే షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిని మార్చినట్లు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఎవరెన్ని చెప్పినా.. మళ్లీ శిగ్గావి నియోజకవర్గంలో మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థికే టికెట్ ఇచ్చామని చెప్పారు. నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారని.. అందుకే మైనార్టీ ఓటర్లను ఆకట్టుకునే సమర్థుడైన అభ్యర్థికే టికెట్‌ ప్రకటించామని డీకే శివకుమార్‌ స్పష్టం చేశారు.

'ఈ ఎన్నికల్లో బీజేపీయే మాకు గట్టి పోటీదారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించడమే మా లక్ష్యం. వ్యక్తిగత స్నేహ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని.. బీజేపీ అభ్యర్థి గెలుపునకు మద్దతివ్వలేం. షిగ్గావ్ సహా రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనైనా ఇతర పార్టీల అభ్యర్థులు గెలవడానికి కాంగ్రెస్ అస్సలు సహకరించదు. మా పార్టీ అభ్యర్థుల గెలుపే మాకు ముఖ్యం. కుమ్మక్కయ్యారనే ఆరోపణలు సత్యదూరం' అని కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.