యాప్నగరం

Karnataka election: అసద్ ఎన్‌కౌంటర్ తర్వాత.. యోగికి కర్ణాటకలో భారీ డిమాండ్!

Karnataka election: ప్రస్తుతం దేశ ప్రజల ఫోకస్ అంతా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పైనే ఉంది. 2024లో జరిగే పార్లమెంట్ ఇవి సెమీ ఫైనల్‌ అని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటకలో అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉంది. అందుకే అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్‌గా యోగిని రంగంలోకి దింపింది. ఇటు అసద్ ఎన్‌కౌంటర్ తర్వాత.. కర్ణాటకలో యోగికి డిమాండ్ భారీగా పెరిగింది.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 19 Apr 2023, 9:33 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటక ఎన్నికలపై బీజేపీ సీరియస్ ఫోకస్
  • గెలుపే లక్ష్యంగా అడుగులేస్తున్న కమల దళం
  • కర్ణాటకలో యోగికి భారీగా పెరిగిన డిమాండ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Yogi Adityanath
యోగి ఆదిత్యనాథ్
Karnataka election: ఏప్రిల్ 15న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. అంతకుముందు అతిక్ కుమారుడు అసద్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో లేపేశారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. మిట్టి మీ మిలా దేంగే డైలాగ్ మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో.. కర్ణాటకలో (Yogi Adityanath,) కి భారీగా డిమాండ్ పెరిగింది. బీజేపీలోని కీలక నేతల కంటే.. యోగి వస్తే తమకు లాభం జరుగుతుందని చాలా మంది అభ్యర్థులు పార్టీని అభ్యర్థిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఈ జాబితాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హేమంత్ బిస్వా శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. ఇంత మంది ఉన్నా కూడా.. యోగికి భారీగా డిమాండ్ ఉంది.

కోస్టల్ కర్ణాటక, హిందుత్వం సమస్య ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలు నిర్వహిస్తే.. బాగుంటుందని నేతలు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో చాలా చోట్ల యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ ర్యాలీల్లో కూడా బుల్డోజర్, మిట్టి మీ మిలా దేంగే డైలాగ్‌లు ఎక్కువగా ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కోస్టల్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఆ స్థానాల్లో యోగి సహా.. కీలక నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.

మే 10న ఒకే దశలో 224 స్థానాల్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 2023 కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీ(ఎస్) మూడు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది, కాంగ్రెస్ 87 స్థానాలను కైవసం చేసుకోగా.. జేడీ(ఎస్) 30 స్థానాల్లో విజయం సాధించింది. తొలుత కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కమలం అధికార పీఠాన్ని అధిరోహించింది.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.