యాప్నగరం

Karnataka BJP: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ సీనియర్ నేత

Karnataka BJP: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత ఝలక్ ఇచ్చారు. తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. బీజేపీ చీఫ్ నడ్డాకు లేఖ రాసి ఈ విషయాన్ని వెల్లడించారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 11 Apr 2023, 4:45 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటక బీజేపీలో ఊహించని పరిణామం
  • ఎన్నికల రాజకీయాలకు దూరంగా కేఎస్ ఈశ్వరప్ప
  • బీజేపీ చీఫ్ నడ్డాకు లేఖ రాసిన ఈశ్వరప్ప
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu KS Eshwarappa
కేఎస్ ఈశ్వరప్ప
Karnataka BJP: మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. తాను పోటీ చేయబోనని కర్ణాటక బీజేపీ సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ప్రకటించారు. ఈ విషయంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. తాను ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తన ఇష్టానుసారంగానే తీసుకున్నట్టు చెప్పారు. కేఎస్ ఈశ్వరప్ప (KS Eshwarappa) ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. సుదీర్ఘ రాజకీయం అనుభవంలో.. ఆయనపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.
ఈశ్వరప్పకు జూన్‌లో 75 ఏళ్లు నిండుతాయి. అయితే.. బీజేపీ నిబంధనల ప్రకారం.. ఎన్నికలలో పోటీ చేయడానికి, అధికారిక పదవులను నిర్వహించడానికి వయోపరిమితి విధించారు. అప్పుడప్పుడు మినహాయింపులు ఉన్నప్పటికీ.. దీన్ని పార్టీ కచ్చితంగా ఫాలో అవుతోంది. ఈ నేపథ్యంలో.. ఈశ్వరప్ప ఎన్నికల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు తెలుసోతంది. ఇటు 224 అసెంబ్లీకి స్థానాలకు జరిగే ఎన్నికల కోసం.. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. తొలి జాబితాను మంగళవారం లేదా బుధవారం విడుదల చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వివరించారు.

అభ్యర్థుల జాబితా విడుదల చేయడంలో ఎలాంటి గందరగోళం లేదని బొమ్మై స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక గురించి మరిన్ని చర్చలు జరగాల్సి ఉందని.. అందుకే మంగళవారం లేదా బుధవారం విడుదల చేస్తామని బొమ్మై ఢిల్లీలో చెప్పారు. "కొంతమంది అభ్యర్థుల కోసం మరింత గ్రౌండ్ రిపోర్ట్ సేకరించాల్సి ఉంది. మరింత సమాచారం రావాలి. కొత్త అభ్యర్థులపై చర్చ జరగాలి" అని ముఖ్యమంత్రి బొమ్మై చెప్పారు.

ఇటు అభ్యర్థుల విషయంపై.. మాజీ సీఎం యడియూరప్ప స్పందించారు. చర్చలు జరిగాయని, అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తామని యడియూరప్ప చెప్పారు. జాబితా విడుదల చేయడంలో జాప్యం జరగలేదని స్పష్టం చేశారు. నడ్డా ఏర్పాటు చేసిన సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ఆయన్ను ప్రశ్నించగా.. 'నేను ఇచ్చిన సలహాలను వారు (బీజేపీ నాయకత్వం) అంగీకరించారు. మేము సంపూర్ణ మెజారిటీని పొందబోతున్నాము. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.. అందులో ఎలాంటి సందేహం లేదు' యడియూరప్ప స్పష్టం చేశారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.