యాప్నగరం

Karnataka Results: మోదీ, అమిత్ షా కాదు.. ఎవరు వచ్చినా ఇదే జరిగేది: సిద్ధరామయ్య

Karnataka Results: అందరి అంచనాలకు తగ్గట్టే.. కర్ణాటకలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. స్పష్టమైన మెజార్టీ దిశగా అడుగులేస్తోంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌లో ఉన్నారు. ఇటు కీలక నేతలు కూడా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో.. సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెబుతూనే.. బీజేపీ తరఫున జోరుగా ప్రచారం చేసిన ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా పై పంచ్‌లు పేల్చారు.

Authored byశివకుమార్ బాసాని | Samayam Telugu 13 May 2023, 12:53 pm

ప్రధానాంశాలు:

  • కర్ణాటక ఫలితాల్లో దూసుకెళ్తున్న కాంగ్రెస్
  • సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఛాన్స్
  • ఫలితాలపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Siddaramaiah
సిద్ధరామయ్య
Karnataka Results: కాంగ్రెస్ 120 సీట్లకు పైగా గెలిచి.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. ఆ పార్టీ ముఖ్యనేత సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ మద్దతుదారుల పర్యటన.. ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపలేదని విశ్లేషించారు. అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్ వంటి నేతల ప్రభావం కర్ణాటక ప్రజలపై లేదని స్పష్టమైందన్నారు. ఇదే ఊపుతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని Siddaramaiah విశ్వాసం వ్యక్తం చేశారు.
'నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా ఎన్నిసార్లు రాష్ట్రానికి వచ్చినా.. కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని నేను ముందే చెప్పాను. బీజేపీ, వారి అవినీతి, దుష్పరిపాలనతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు. వారివి ప్రజా వ్యతిరేక రాజకీయాలు' అని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
కౌంటింగ్ తొలి రౌండ్లలోనే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేసింది. మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో కేవలం కర్ణాటక రాష్ట్రంలోనే కాదు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు సందడిగా మారాయి. నేతలు, కార్యకర్తలు పార్టీ ఆఫీసులకు క్యా కట్టారు.
రచయిత గురించి
శివకుమార్ బాసాని
శివకుమార్ బాసాని సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు, రాజకీయ వార్తలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.