యాప్నగరం

మిజోరం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

ఈసీ నోటిఫకేషన్ ప్రకారం.. నామినేషన్ పత్రాల పరిశీలన నవంబర్ 12న జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహకరణకు ఆఖరి తేదీ నవంబర్ 14.

Samayam Telugu 9 Nov 2018, 4:34 pm
మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈనెల 2వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించింది. ఈనెల 9వ తేదీతో నామినేషన్ల గడువు ముగియనుందని ఈసీ పేర్కొంది. ఈనెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. ఒకే దశలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
Samayam Telugu 750590-1931925


ఈసీ నోటిఫకేషన్ ప్రకారం.. నామినేషన్ పత్రాల పరిశీలన నవంబర్ 12న జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉపసంహకరణకు ఆఖరి తేదీ నవంబర్ 14. చివరిగా ఓట్ల లెక్కింపు డిసెంబర్ 11న జరుగుతుంది. కాగా, 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరం రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ గడువు డిసెంబర్ 15తో ముగియనుంది. ఈశాన్యంలో కాంగ్రెస్ అధికారంలో ఏకైక రాష్ట్రం మిజోరం.

ఇదిలా ఉంటే.. ఇప్పటీకే కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎఫ్‌, బీజేపీ, ఎన్సీపీలు పార్టీ అభ్యర్థులను ప్రకంటించాయి. కాంగ్రెస్‌, మిజో నేషనల్‌ ఫ్రంట్‌ మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది.

మిజోరం ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్: నవంబరు 2
నామినేషన్లు: నవంబరు 2 నుంచి నవంబరు 9
ఉపసంహరణ గడువు: నవంబరు 14
పోలింగ్: నవంబరు 28
ఓట్ల లెక్కింపు: డిసెంబర్ 11
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.