యాప్నగరం

Rajasthan Exit Poll: అనుకున్నదే జరిగింది.. బీజేపీకి షాక్!

ప్రీ పోల్స్ మొదలైనప్పటి నుంచీ రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకే అధికారమని ప్రచారం జరిగింది. నేడు ఎగ్జిట్ పోల్స్‌లోనూ కాంగ్రెస్ దూసుకెళ్లింది.

Samayam Telugu 7 Dec 2018, 7:42 pm
రాజస్థాన్‌లో మళ్లీ పాత సంప్రదాయమే కొనసాగే అవకాశం ఉంది. ఓసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే, తర్వాతి ఎన్నికల్లో బీజేపీకి అధికారం అప్పచెప్పడం జరుగుతుంది. ప్రస్తుత ఎన్నికల్లోనూ దాదాపు అదే జరగనుందని ఎగ్జిట్ పోల్స్ సర్వే చూస్తే అర్థమవుతోంది. సీఎం వసుంధర రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు ఓటమి తప్పదని సర్వేలన్నీ మూకుమ్మడిగా చెబుతున్నాయి.
Samayam Telugu Rajasthan Exit Polls


నేడు ఎన్నికలు ముగిసిన అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్‌దే అధికారమని తేల్చేశాయి. సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం బీజేపీకి 85 సీట్లు, కాంగ్రెస్‌కు 105 సీట్లు దక్కుతాయి. బీఎస్పీ రెండు చోట్ల, ఇతరులు ఏడు స్థానాల్లో విజయం సాధిస్తారని అంచనా వేసింది. జన్ కా బాత్ సర్వే ప్రకారం బీజేపీ 93, కాంగ్రెస్ 91 సీట్లను గెలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్ నెగ్గుతుందని, సచిన్ పైలట్ సీఎం అవుతారని ప్రీ పోల్ సర్వేల్లో వచ్చిన విషయం తెలిసిందే.

ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం బీజేపీ 55-72 సీట్లు, కాంగ్రెస్ 119-141 సీట్లు నెగ్గనుంది. ఇతరులు 4 నుంచి 11 స్థానాల్లో నెగ్గనున్నాయని అంచనా వేసింది. టైమ్స్ నౌ-సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 105 స్థానాలు, బీజేపీ 85, ఇతరులు 7, బీఎస్పీ 2 స్థానాలు నెగ్గుతాయని తెలిపింది. సీ ఓటర్ సర్వే ప్రకారం బీజేపీకి 60 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 137 సీట్లు, ఇతరులు 2 సీట్లు సాధించనుంది.

బీజేపీకి మైనస్ వసుంధరనే!
వసుంధర రాజే సీఎం కాకూడదని ఏకంగా 48 శాతం మంది కోరుకుంటున్నారని ఇటీవల చేసిన ప్రీ పోల్ సర్వేల్లో తేలింది. ఆమె తీరును సొంత పార్టీ నేతలకు మింగుడు పడలేదని, సీఎం అభ్యర్థిని మార్చకపవడం అధికార బీజేపీకి నష్టం చేసినట్లు కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.