యాప్నగరం

Tamil Nadu Elections: సినీ నటి ఖుష్బూకి షాక్.. గీత దాటారంటూ కేసు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీనియర్ నటి కుష్బూకి ఈసీ షాకిచ్చింది. ఆమెపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. అడిషనల్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Samayam Telugu 3 Apr 2021, 5:51 pm
తమిళనాట ఎన్నికల ప్రచారం హాట్‌హాట్‌గా సాగుతున్న వేళ బీజేపీ అభ్యర్థి, సినీ నటి ఖుష్బూ సుందర్‌కి ఊహించని షాక్ తగిలింది. ఆమెపై ఎన్నికల సంఘం అధికారులు కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆమెపై కేసు నమోదైంది. చెన్నైలోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ కూటమి అభ్యర్థిగా ఖుష్బూ బరిలో ఉన్నారు. కోడంబాక్కంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖుష్బూ నిబంధనలను ఉల్లంఘించి మసీదు ఎదుట ప్రచారం నిర్వహించినందుకు ఎన్నికల అధికారులు కేసు నమోదు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
khushbu


కోడంబాక్కంలోని ఓ మసీదు ఎదుట బీజేపీ అభ్యర్థి ఖుష్బూ ఎన్నికల ప్రచారం నిర్వహించారని.. అక్కడ పార్టీ కార్యకర్తలు కరపత్రాలు కూడా పంపిణీ చేశారని అడిషనల్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ఫిర్యాదు చేశారు. మసీదు ఎదుట పార్టీ కార్యకర్తలు గుంపులుగా నిలబడడంతో పాటు.. అక్కడ పార్టీ ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారని తెలిపారు. అధికారుల అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ప్రార్థనా స్థలాల వద్ద ప్రచారం నిర్వహించినందుకు ఖుష్బూపై కేసు నమోదైంది.

కుష్బూ బరిలో నిలిచిన థౌజండ్ లైట్స్ నియోజవర్గం నుంచి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ గతంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. 1989లో ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 1996, 2001, 2006 ఎన్నికల్లో వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థి గెలుపొందారు. గత ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థి సెల్వమ్ గెలుపొందారు. డీఎంకేకి పెట్టని కోటగా ఉన్న థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి ఖుష్బూ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.