యాప్నగరం

తమిళగడ్డపై కాలిగోరు కూడా పడనివ్వం.. బీజేపీకి చిదంబరం స్ట్రాంగ్ వార్నింగ్

తమిళనాడులో కాలుమోపాలని తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ.. ఏకంగా ప్రధాని మోదీ, అమిత్ షా సహా అగ్రనేతలతో ప్రచారం హోరెత్తించింది. అయినా తమిళగడ్డపై అడుగుపెట్టనివ్వబోమని కాంగ్రెస్ నేత షాకింగ్ కామెంట్స్ చేశారు.

Samayam Telugu 5 Apr 2021, 3:13 pm
తమిళనాట ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈసారి ఎలాగైనా తమిళనాడులో బోణీ చేయాలని భావిస్తున్న బీజేపీ అధికార అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల బరిలో దిగింది. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రంగంలోకి దిగారు. రోడ్‌షోలు, ప్రచార కార్యక్రమాలతో హోరెత్తించారు. ఎన్నడూ లేని విధంగా తమిళనాడుపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా తమిళ గడ్డపై అడుగుపెట్టాలని ఈ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
chidambaram


అయితే బీజేపీ వ్యూహాలను తిప్పికొడతామని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా పదే పదే తమిళనాడుకు క్యూ కట్టారని.. అలా రావడంతో వారి నిజస్వరూపం బయటపడిందని ఆయన అన్నారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ దాడులు చేయించడాన్ని తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఎవరి ఇళ్లలో సోదాలు చేయాలో బీజేపీకి వెన్నతో పెట్టిన విద్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళగడ్డపై బీజేపీ కాలిగోరు కూడా పడనిచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కూటమి గెలవబోతోందని ఆయన అన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.