యాప్నగరం

మోదీజీ మా నియోజకవర్గానికి రండి.. ప్రత్యర్థుల రిక్వెస్ట్.. అసలు కథ వేరే.!

ప్రధాని మోదీజీ మా నియోజకవర్గానికి రండి. మీ ప్రచారం మాకు సహకరిస్తుంది. భారీ మెజార్టీతో గెలుస్తాను అంటూ ప్రత్యర్థి పార్టీల నేతలు ట్వీట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.

Samayam Telugu 2 Apr 2021, 6:29 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడడంతో పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. స్టార్ క్యాంపెయినర్లు, నేతలు జోరు పెంచారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఏఐఏడీఎంకే, పీఎంకే, బీజేపీ కూటీమి అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రోడ్‌ షోలతో అదరగొడుతున్నారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
modi


అయితే మోదీ - షా ప్రచారం తమ అభ్యర్థులకు ఎంత కలిసొస్తుందో తెలియదు కానీ.. తమకు మాత్రం బాగా కలిసొస్తుందంటూ డీఎంకే నేతలు సెటైర్లు వేస్తున్నారు. ప్రధాని మోదీజీ.. మా నియోజకవర్గానికి ప్రచారానికి రండి అంటూ వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానిగారు.. దయచేసి మా నియోజకవర్గంలోని ఏఐఏడీఎంకే, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయండి. మేం భారీ తేడాతో గెలిచేందుకు మీ ప్రచారం సహకరిస్తుందంటూ డీఎంకే నేతలు వ్యగ్యంగా ట్వీట్లు చేశారు. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ.. నేను కుంభం నియోజకవర్గంలో డీఎంకే తరఫున బరిలో ఉన్నాను. మా నియోజకవర్గంలో మీరు ప్రచారం చేస్తే భారీ తేడాతో గెలుస్తాను అంటూ డీఎంకే నేత రామక్రిష్ణన్ ట్వీట్ చేశారు. అదన్నమాట అసలు కథ!!

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.