యాప్నగరం

Tamil Nadu: స్టాలిన్ అల్లుడి ఇంట్లో సోదాలు.. జమ్మూకశ్మీర్, కోల్‌కతాలో రియాక్షన్

డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కూతురు ఇంట్లో ఐటీ సోదాలు జరగడం రాజకీయంగా కలకలం రేపింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయించిందని డీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు.

Samayam Telugu 2 Apr 2021, 9:26 pm
తమిళనాడు ఎన్నికల వేళ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కూతురి ఇంట్లో ఐటీ సోదాలు జరగడం సంచలనంగా మారింది. స్టాలిన్ అల్లుడు శబరీషన్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. చెన్నైలోని నాలుగుచోట్ల అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఐటీ దాడులు జరగడం తమిళనాట కలకలం రేపింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
stalin


కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయించిందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో స్టాలిన్‌కు అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. సొంతరాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలు కూడా ఐటీ దాడులను తీవ్రంగా తప్పుబడుతున్నారు.
చెన్నైలో స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ సోదాలు జరగడంపై జమ్మూ కశ్మీర్‌లో రియాక్షన్ వచ్చింది. జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్రంగా మండిపడ్డారు.

మోదీ ప్రభుత్వం దేశంలోని ప్రతిపక్ష పార్టీలను వేటాడుతోందని మెహబూబా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ స్టాలిన్ కుటుంబ సభ్యుల ఇళ్లపై దాడులే అందుకు నిదర్శనమని ఆమె అన్నారు. దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకమై కేంద్రం దాడులను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అందుకు పశ్చిమ బెంగాల్ ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ చొరవ తీసుకోవాలని కోరారు. అయితే మెహబూబా వినతికి దీదీ ఎలా స్పందిస్తారో చూడాలి మరి!!

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.