యాప్నగరం

బుద్ధిలేదా అంటూ టీఆర్ఎస్ అభ్యర్థిపై మహిళ ఫైర్

సమస్యను పరిష్కరించకుండా ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చారని గోపీనాథ్ సహా టీఆర్ఎస్ కార్యకర్తలను ఓ మహిళ ప్రశ్నించారు.

Samayam Telugu 10 Nov 2018, 5:59 pm
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను ఓ మహిళ అడ్డుకుని ప్రశ్నించారు. ఓట్ల అడగటానికి బుద్ధిలేదా అంటూ తాజా మాజీ ఎమ్మెల్యేపై స్థానిక మహిళ మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలను సైతం ఆ మహిళ కడిగిపారేశారు. సమస్యను పరిష్కరించకుండా ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చారని నేతను ప్రశ్నించారు.
Samayam Telugu Maganti Gopinath


శనివారం (నవంబర్ 10) కళ్యాణ్ నగర్ ఫేజ్-1 లో తాజా మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కళ్యాణ్ నగర్ స్థల వివాదం విషయమై ఏం పరిష్కరించారని స్థల యజమాని అనంతనాగ్ భార్య టీఆర్ఎస్ నేతను నిలదీశారు. మా సమస్యను ఏం పరిష్కారం చేశారని మహిళ అడిగితే.. రోడ్డుమీద కాదు తర్వాత మాట్లాడదం అని గోపీనాథ్ అన్నారు. తమాషా చేస్తున్నారా.. బుద్ధిలేదా ఓట్లు అడిగేందుకు వచ్చావ్ అని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇంటికి రాలేదంటూ గోపీనాథ్ అక్కడినుంచి వెళ్లిపోయారు.

కేటీఆర్ దగ్గరికి వెళ్తాం
మీ ఓట్లు అడగలేదని టీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పగా.. కాలనీలో మేం కూడా ఉన్నాం, ఓట్లు అడిగేందుకు ఎందుకు వచ్చారంటూ మండిపడ్డారు. కేటీఆర్ దగ్గరికి వెళ్తాం, మా సమస్యను పరిష్కరించుకుంటామన్నారు. మీ ఓటు అవసరం లేదని టీఆర్ఎస్ కార్యకర్తలు అనడంతో మహిళ ఆగ్రహం రెట్టింపు అయింది. ఓట్లు అడగొద్దు వెళ్లిపోండని మహిళ అన్నారు. అడిగే పద్ధతి ఇదేనా అని మహిళతో టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవపడ్డారు. సమస్యలపై నిలదీసిన మహిళను మాగంటి గోపీనాథ్ అనుచరులు దినేష్ చౌదరి, విజయ్ ముదిరాజ్, తదితరులు హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.