యాప్నగరం

Telangana Election Results: తొందరెందుకు.. 11 వరకు ఆగండి - అసదుద్దీన్ ఒవైసీ

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటినుంచీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఫలితాల కోసం వేచిచూస్తున్నారు.

Samayam Telugu 10 Dec 2018, 8:26 am
ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న రోజు నుంచీ తమకు 100 సీట్లు అని చెప్పిన టీఆర్ఎస్ మరోసారి అధికారం తమదేనని చెబుతోంది. సొంత పార్టీ సంఖ్యా బలంతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ చెబుతున్నారు. టీఆర్ఎస్ ప్రకటనలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఫలితాలు వచ్చే వరకూ టీఆర్ఎస్ ఎదురుచూడటం ఉత్తమమని సూచించారు.
Samayam Telugu Asaduddin


ఏ ఆధారాలు లేకుండా విజయం తమదేనని అంచనాలు వేస్తున్నారని అసదుద్దీన్ చెప్పారు. మరోవైపు తనను ప్రజా కూటమి ఆహ్వానించిందని వస్తున్న వదంతులపై స్పందించడం తనకు ఇష్టం లేదన్నారు. ఫలితాలు వచ్చే వరకు అందరూ ఎదురుచూడటం మంచిదన్నారు. కాగా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంఐఎం, కాంగ్రెసేతర పార్టీలతో తాము కలిసేందుకు సిద్ధమని పరోక్షంగా టీఆర్ఎస్‌తో కలవబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

కాగా, తమకు ఎవరి భాగస్వామ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, స్పష్టమైన మెజార్టీతో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి భాను ప్రసాద్ పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.