యాప్నగరం

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది: అక్బరుద్దీన్ ఒవైసీ

తనను చంపేందుకు భారీ కుట్ర జరుగుతోందని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది దిగారంటూ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.

Samayam Telugu 10 Nov 2018, 7:56 pm
‘‘నన్ను చంపేందుకు భారీ కుట్ర జరుగుతోంది. నన్ను చంపుతామని బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి’’ అని ఎంఐఎం అగ్రనేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. శుక్రవారం రాత్రి యూకత్‌పురా బడాబజార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 11 మంది దిగారన్నారు.
Samayam Telugu images1


గతంలో కూడా తనను చంపేందుకు రెక్కీ జరిపారని, తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని తెలిపారు. వారణాసి, అహ్మదాబాద్, కర్నాటక నుంచి కొంతమంది వ్యక్తులు తనను హత్య చేసేందుకు హైదరాబాద్‌ వచ్చారన్నారు. ప్రజల అండదండలే తనకు రక్ష అని, తనను చంపితే వీధికో అక్బరుద్దీన్ పుడతాడన్నారు. అక్బరుద్దీన్ మాటలతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయనకు వస్తున్న బెదిరింపు లేఖలు, ఫోన్ కాల్స్‌పై దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో రెక్కీ జరుపుతున్న వ్యక్తులెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.