యాప్నగరం

ఎవరీ ఖాసిం రజ్వీ.. రజాకార్ల నేతగా ఎలా ఎదిగాడు?

తెలంగాణలో దమణకాండ సాగించిన రజాకార్లకు ఖాసిం రజ్వీ ఎలా నాయకుడయ్యాడు. అతడు ఎక్కడ నుంచి వచ్చాడు.

Samayam Telugu 6 Dec 2022, 7:13 pm
1927లో నాటి నిజాం రాజు బహదూర్ యార్ జంగ్ తన అనుచరులతో ‘ఎంఐఎం’ పార్టీని పెట్టించారు. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మత విస్తరణ, దాని సాంస్కృతిక వైభవాన్ని కాపాడే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. అయితే.. 1944లో బహదూర్ యార్ జంగ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఎంఐఎం నాయకత్వం ఖాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్లిపోయింది. నాటి నుంచి ఎంఐఎం స్వరూపమే మారిపోయింది. బహదూర్ యార్ జంగ్‌ను విషమిచ్చి హత్య చేసినట్లు చరిత్రకారులు చెబుతారు.
Samayam Telugu kasim razvi
ఖాసీం రజ్వి


ఖాసిం రజ్వీ పేరున్న వక్త, న్యాయవాది. ఉత్తరప్రదేశ్ నుంచి నాటి నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న లాతూర్‌కు వలస వచ్చిన ముస్లిం ఛాందసుల్లో రజ్వీ ఒరు. ఖాసిం రజ్వీ నాయకత్వంలో హైదరాబాద్‌ను రక్షించడానికి మొదలైన రజాకార్ల ఉద్యమం ఆ తర్వాత కాలంలో ఒక రాక్షస మూకగా మారింది.

అంతగా సైనిక బలం లేని నిజాం రాజు బ్రిటిష్ పాలకులతో, భారతదేశపు నాయకత్వంతో చర్చలు, సంప్రదింపులు ఒప్పందాలు చేసుకుంటున్న సందర్భంలో.. నాటి హైదరాబాద్ ప్రధాని లియాఖత్ అలీ అటు జాతీయ కాంగ్రెస్‌కు ఇటు హైదరాబాద్ పాలకులకు కంటిలో నలుసులా తయారవుతున్న కమ్యూనిస్ట్ ఉద్యమకారుల్ని అంతంచేసి ప్రజా ఉద్యమాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ‘రజాకార్లు’ అనే స్వయంసేవకులను సృష్టించారు. దీనికి మజ్లిస్ పార్టీ (ఎంఐఎం) నాయకుడుగా ఉన్న ఖాసిం రజ్వీని ఎంచుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.