యాప్నగరం

Andole Result: తెలంగాణలో ‘అందోల్‌’ సెంటిమెంట్ రిపీట్..!

ఆందోల్‌లో టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌ పోటీపడాల్సి ఉంది. కానీ.. నియోజకవర్గంలో సర్వే చేయించిన కేసీఆర్.. అతడి స్థానంలో క్రాంతి కిరణ్‌కి టికెట్ ఇచ్చారు.

Samayam Telugu 12 Dec 2018, 6:43 pm
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆందోల్’ సెంటిమెంట్ మళ్లీ పునరావృత‌మైంది. మెదక్‌ జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు అందోల్‌ శాసనసభ స్థానంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే..? రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ఆ పార్టీనే అధికారంలోకి వస్తోంది. ఎంతలా అంటే.. 1957 నుంచి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా.. ఆందోల్‌లో గెలిచిన పార్టీ ఏకంగా 12 సార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగిన సీనియర్ టీవీ జర్నలిస్ట్‌ క్రాంతి కిరణ్ చంటి 16,465 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కి 88 స్థానాలు దక్కిన విషయం తెలిసిందే. దీంతో.. మళ్లీ ఆందోల్ సెంటిమెంట్ నిజమైందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1957, 1983 ఎన్నికల్లో మాత్రమే ఆందోల్‌‌లో గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు.
Samayam Telugu 100


వాస్తవానికి టీఆర్‌ఎస్ తరఫున సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాబూమోహన్‌ పోటీపడాల్సి ఉంది. కానీ.. నియోజకవర్గంలో సర్వే చేయించిన కేసీఆర్.. అతడి స్థానంలో క్రాంతి కిరణ్‌కి టికెట్ ఇచ్చారు. దీంతో.. పార్టీ వీడిన బాబూమోహన్‌ బీజేపీలో చేరి.. పోటీచేశారు. కానీ.. ఎన్నికల్లో అతనికి డిపాజిట్ కూడా దక్కలేదు. క్రాంతి మొత్తం 1,04,229 ఓట్లని దక్కించుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ 87,764 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. వీరి మధ్య ఓట్ల వ్యత్యాసమే 16,465కాగా.. బాబూ మోహన్‌కి దక్కిన ఓట్లు 2,404 మాత్రమే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.