యాప్నగరం

టీడీపీ కార్యకర్తల్లా ఏపీ ఇంటెలిజెన్స్: బాల్క సుమన్

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నోట్ల కట్టలతో తెలంగాణకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 27 Oct 2018, 4:08 pm
తెలంగాణ అసెంబ్లీ రద్దు కాగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ను హైదరాబాద్ తీసుకొచ్చారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తాజాగా టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మరో అడుగు ముందుకేసి.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణ గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల్లా తిరుగుతున్నారని ఆరోపించారు.
Samayam Telugu Balka Suman


ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నోట్ల కట్టలతో తెలంగాణకు వస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రంలోకి పొరుగు రాష్ట్రం ఇంటెలిజెన్స్ అధికారులను తేవడాన్ని గవర్నర్ నరసింహన్, డీజీపీ పరిగణనలోకి తీసుకోవాలని బాల్క సుమన్ కోరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే చూస్తు ఊరుకునేది లేదని కాంగ్రెస్ నేత, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని హెచ్చరించారు. ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ బచ్చా అయితే.. ఉత్తమ్ ఓ లుచ్చా అంటూ వ్యాఖ్యలు చేశారు. మహాకూటమి ద్రోహుల కూటమి అని వారికి అసెంబ్లీ ఎన్నికలతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.