యాప్నగరం

Gvl Narasimha Rao: బాబూ.. కోతలకు ఓట్లు పడవ్.. ఏపీలో కౌంట్‌డౌన్ మొదలు: జీవీఎల్

చంద్రబాబు నాయుడును ఆంధ్ర సెటిలర్స్‌ కూడా నమ్మడం లేదని తెలంగాణ ఫలితాలతో రుజువైంది. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఓటమికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది.

Samayam Telugu 11 Dec 2018, 3:41 pm
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తోంది. కారు ప్రత్యర్థులకు దొరకనంత జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఈ ఫలితాలు గులాబీ పార్టీలో ఫుల్ జోష్ నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇటు ఓటమితో కూటమి నేతలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇదే సమయంలో కూటమి పార్టీగా ఉన్న టీడీపీకి సెటైర్ల సెగ గట్టిగానే తాకుతోంది. ప్రత్యర్థి పార్టీల నేతలు.. చంద్రబాబు టార్గెట్‌గా పంచ్‌లు పేలుస్తున్నారు.
Samayam Telugu gvl.


తాజాగా తెలంగాణలో ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ ఎన్నికల్లో ప్రజాకూటమి తరపున ప్రచారం నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు. ఆ ట్వీట్‌లో‘చంద్రబాబు నాయుడును ఆంధ్ర సెటిలర్స్‌ కూడా నమ్మడం లేదని తెలంగాణ ఫలితాలతో రుజువైంది. టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో ఓటమికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. కోతలకు ఓట్లు పడవని, అడ్డగోలు అవినీతికి, అహంకారానికి మూల్యం చెల్లించిక తప్పదని ఆంధ్ర సెటిలర్లలు టీడీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇచ్చారు’అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.