యాప్నగరం

ఓటర్ల జాబితాపై ఫిర్యాదులందాయి.. నగదు, మద్యం పంపిణీ కట్టడి చేస్తాం: ఓపీ రావత్‌

ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉన్నాయని ఫిర్యాదులు అందాయి.. పార్టీల సూచనల్ని పరిగణలోకి తీసుకుంటాం.. నగదు, మద్యం పంపిణీ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం..

Samayam Telugu 24 Oct 2018, 2:25 pm
తెలంగాణలో ఎన్నికల్ని పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావత్. మూడు రోజుల పర్యటనలో అధికారులు, పార్టీలు, ప్రజలతో విస్తృతంగా చర్చించామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించామని.. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉన్నాయని ఫిర్యాదులు అందాయని.. సవరించేందుకు చర్యలు చేపడతామన్నారు. ఎన్నికల అధికారులు, ఎస్పీల పనితీరుపై సంతృప్తిగా ఉందని.. ఏర్పాట్లపై అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.
Samayam Telugu Rawat.


ఎన్నికల నిర్వహణపై అన్ని రాజకీయ పార్టీలు వెల్లడించిన అంశాలను పరిగణనలోకి తీసుకున్నామన్నారు రావత్. వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు స్వీకరించామని.. కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ యంత్రాలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. నగదు, మద్యం పంపిణీ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈసీ బృందం మూడు రోజుల పాటూ తెలంగాణలో పర్యటించింది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేశారు. అలాగే రాజకీయ పార్టీల నేతలు, వివిధ వర్గాల ప్రజలతో కూడా భేటీ అయ్యారు. బుధవారం ఉదయం ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో ఈసీ బృందం సమావేశమైంది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఐటీ అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.