యాప్నగరం

భల్లాలదేవుడి రాజ్యంలో ‘బాహుబలి’.. కథ చెప్పిన బాలయ్య!

తెలంగాణ ఎన్నికల ప్రచార సభలో ‘బాహుబలి’ కథ చెప్పిన బాలకృష్ణ..

Samayam Telugu 1 Dec 2018, 10:31 pm
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గోడానికి హైదరాబాద్ వచ్చిన ఏపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ శనివారం రాత్రి సనత్ నగర్, ముషీరాబాద్‌లలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కేసీఆర్ ప్రభుత్వాన్ని భల్లాలదేవుడి రాజ్యంతో పోల్చారు. చంద్రబాబు నాయుడును ‘బాహుబలి’ అంటూ కొనియాడారు.
Samayam Telugu Balakrishna


సనత్ నగర్ రోడ్‌షోలో బాలయ్య మాట్లాడుతూ మహిష్మతి రాజ్యాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోల్చుతూ చిన్న కథ చెప్పారు. ‘‘మీరంతా ‘బాహుబలి’ చూసే ఉంటారు. అందులో మహిష్మతి రాజ్యానికి భల్లాలదేవుడు రాజైతే అయ్యాడు. కానీ, అక్కడి ప్రజల కళ్లలో నిలిచిపోయింది మాత్రం బాహుబలే. అలాగే తెలంగాణలో కూడా కేటీఆర్ ప్రభుత్వం నడుస్తున్నా.. ప్రజల గుండెల్లో మాత్రం చంద్రబాబు నాయుడే ఉన్నారు’’ అని తెలిపారు.

సనత్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురించి ఆయన మాట్లాడుతూ ‘‘కన్నతల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా.. తలసాని టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్‌లో చేరాడు. తల్లిలాంటి పార్టీని మోసం చేసిన వ్యక్తిని తరిమికొట్టండి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ వెంటే ఉన్న మహాకూటమి అభ్యర్థి వెంకటేశ్‌గౌడ్‌ను గెలిపించండి’’ అని బాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం మొన్నటివరకు మద్దతిచ్చిన టీఆర్ఎస్ ఇప్పుడు మాట మార్చిందని, ఇందుకు మోదీతో ఉన్న సంబంధాలే కారణమని బాలయ్య విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.