యాప్నగరం

చేవెళ్ల: రెబల్ కాళ్లపై పడి వేడుకున్న కాంగ్రెస్ అభ్యర్థి

ఎన్నికల సిత్రాలు.. అసంతృప్తులను బుజ్జగించే పనిలో అభ్యర్థులు, నేతలు. రెబల్ నేత కాళ్లపై పడి మరీ వేడుకున్న కాంగ్రెస్ అభ్యర్థి..

Samayam Telugu 22 Nov 2018, 3:11 pm
తెలంగాణ ఎన్నికల్లో రెబల్స్ గుబులు టెన్షన్ పెడుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు గురువారం ఆఖరి రోజు కావడంతో.. రెబల్స్‌కు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ విషయానికొస్తే.. ఈ అసంతృప్తుల బెడద కాస్త ఎక్కువగానే ఉంది. దీంతో పార్టీ బడా లీడర్లే రంగంలోకి దిగి.. రెబల్స్‌తో మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో సముచిత స్థానం ఇస్తామంటూ సర్థిచెబుతున్నారు. ఈ బుజ్జగింపులతో మెత్తబడ్డ నేతలు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఓకే అంటున్నారు.
Samayam Telugu chevella.


ఈ రెబల్స్ బుజ్జగించే క్రమంలో బతిమాలడం సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. ఈ బతిమాలడంలో కూడా కాస్త భిన్నమైన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆయనే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎస్‌ రత్నం. కాంగ్రెస్‌ రెబెల్‌ నేత వెంకటస్వామిని బుజ్జగించే క్రమంలో.. రత్నం ఆయన కాళ్లు పట్టుకొని బతిమాలారు. తనకు సహకరించి.. గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చేవెళ్ల టికెట్‌ను కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గం ఇన్‌చార్జి పడాల వెంకటస్వామి ఆశించారు. కాని ఈ మధ్యే టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కేఎస్‌ రత్నంకు టికెట్‌ దక్కింది. దీంతో అలక పాన్పు ఎక్కిన వెంకటస్వామి.. రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో కేఎస్‌ రత్నం.. వెంకటస్వామి ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆ సమయంలోనే కాళ్లకు మొక్కారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.