యాప్నగరం

ప్రజాశీర్వాద సభలు.. కేసీఆర్ పర్యటన వివరాలు

ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని సభల్లో పాల్గొంటారు.

Samayam Telugu 29 Nov 2018, 9:07 am
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ గురువారం (నవంబరు 29) 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో ప్రసంగిస్తారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని ఆదిలాబాద్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని సభల్లో పాల్గొంటారు. కేసీఆర్ ప్రసంగాలతో పార్టీ కేడర్ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంతో దూసుకెళ్తుంది.
Samayam Telugu కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూలు


షెడ్యూలు ఇలా...
* ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌కు వెళ్తారు. ఇందిరాప్రియదర్శిని మినీస్టేడియంలో నిర్వహించే సభలో మాట్లాడుతారు.
* అక్కడి నుంచి ఆసిఫాబాద్ కుమ్రం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో, మధ్యాహ్నం ఒంటిగంటకు ఆసిఫాబాద్‌లో నిర్వహించే సభలో ప్రసంగిస్తారు.
* తర్వాత మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి సీఎం కేసీఆర్ వెళ్తారు. అక్కడ నిర్వహించే సభలో మాట్లాడుతారు.
* మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ మందమర్రికి వెళ్తారు.
* తర్వాత 3.15 గంటలకు మంచిర్యాలకు వెళ్తారు. అక్కడ నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు.
* అనంతరం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో నిర్వహించే రామగుండం నియోజకవర్గ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.