యాప్నగరం

Lagadapati Troll: ఆకు తింటావా లగడపాటి.. ఆడుకుంటున్న నెటిజన్లు

ప్రజా కూటమి 55 నుంచి 65 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. టీఆర్ఎస్ పార్టీకి 35 నుంచి 45 సీట్లు వస్తాయని లగడపాటి తన సర్వేలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే లగపాటి సర్వేకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.

Samayam Telugu 11 Dec 2018, 12:04 pm
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని నేషనల్ మీడియా కోడై కూస్తే.. లగడపాటి రాజగోపాల్ మాత్రం ప్రజా కూటమిదే అధికార పీటం అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. వాస్తవంగా చెప్పాలంటే గులాబీ నేతల గుండెల్లో గుబులు పుట్టించారు. అప్పటి వరకు టీఆర్ఎస్‌దే విజయం అని భావించినవారు కూడా లగడపాటి సర్వేతో అయోమయ స్థితిలోకి వెళ్లిపోయారు. దీనికి కారణం లగడపాటి గత సర్వేలు నిజం కావడమే.
Samayam Telugu Lagadapati


ప్రజా కూటమి 55 నుంచి 65 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. టీఆర్ఎస్ పార్టీకి 35 నుంచి 45 సీట్లు వస్తాయని లగడపాటి తన సర్వేలో వెల్లడించారు. బీజేపీ 5 నుంచి 9 స్థానాల్లో, ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లో, స్వతంత్రులు 5 నుంచి 9 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేశారు. అయితే ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే లగపాటి సర్వేకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. అసలు ఆయన సర్వే ఫలితాలకు ప్రస్తుత ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ సుమారు 90 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో ముందంజలో ఉంది.

Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్

రాజగోపాల్ సర్వే తారుమారు కావడంతో సోషల్ మీడియాలో అప్పుడే ట్రోలింగ్ మొదలైపోయింది. ‘ఆకు.. ఆకు తింటావా’ అంటూ ట్విట్టర్‌లో ఆడేసుకుంటున్నారు. లగపాటి రాజగోపాల్ ప్రజలను మోసం చేశారని, తొలిసారి ఆయన కచ్చితత్వాన్ని కోల్పోయారని మండిపడుతున్నారు. ‘సర్వే జన లగడ సుఖినో దుఖినో భవంతు’ అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ ట్రోలింగ్ ఎలా ఉందో మీరే చూడండి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.