యాప్నగరం

Telengana Congress: పొన్నాల అభ్యర్థిత్వం ఖరారు.. నేడు కాంగ్రెస్ తుది జాబితా

కోదండరాంతో సుదీర్ఘ మంతనాల అనంతరం పొన్నాల అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తూ కుంతియా ప్రకటన చేశారు.

Samayam Telugu 17 Nov 2018, 10:55 am
జనగామ టికెట్‌పై ఉత్కంఠకు తెరపడింది. జనగామ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మహాకూటమి అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా స్పష్టం శుక్రవారం (నవంబరు 16) రాత్రి చేశారు. పొన్నాలకే జనగాం టికెట్‌ ఖరారు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. కోదండరాంతో సుదీర్ఘ మంతనాల అనంతరం కుంతియా ఈ ప్రకటన చేశారు.
Samayam Telugu ponnala


జనగామ స్థానాన్ని కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు టీజేఎస్‌ నేత కోదండరామ్‌ అంగీకరించారని కుంతియా చెప్పారు. శుక్రవారం అర్ధరాత్రి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య.. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు కోదండారామ్‌తో చర్చించిన అనంతరం మీడియాతో కుంతియా మాట్లాడారు.

మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో భాగంగా 14 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో జనసమితి, 3 స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆయన వెల్లడించారు. మహాకూటమి 'కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాం కన్వీనర్‌'గా కోదండరాం ఉంటారని ఆయన పేర్కొన్నారు. కూటమి తరఫున కోదండరాం రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తారని తెలిపారు.

Related Article:
కోదండరామ్‌తో ఉత్తమ్, పొన్నాల భేటీ.. జనగాంపై స్పష్టత

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.