తెలంగాణలో ముందస్తు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన సమయంలో పార్టీ అధిష్టానంపైన విమర్శలు చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ఎంపీగా చేశావు, ఎమ్మెల్సీగా చేస్తున్నావు.. మాకు ఏం చేశావంటూ నిలదీసిన ప్రజలపై ఆయన నిప్పులు చెరిగారు. తాను ఎన్నికల్లో గెలిచిన తర్వాత తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లందరిని బట్టలూసి ఊరేగిస్తానంటూ ఓటర్లను హెచ్చరించడం హాట్ టాపిక్గా మారింది.
నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 4న) ఎన్నికల ప్రచారానికి నాంపల్లి మండలం తుంగపాడ్కు వెళ్లిన రాజగోపాల్రెడ్డిని ప్రజలు అడ్డుకున్నారు. ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి తమకు చేసిన అభివృద్ధిని చెప్పాలని నిలదీశారు.
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చావని ప్రశ్నించిన గ్రామస్తులు, ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో తమ నేతను అడ్డుకుంటావా అని కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకురావడంతో, గ్రామస్తులు కూడా తగ్గకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పి రాజగోపాల్రెడ్డిని అక్కడి నుంచి సురక్షితంగా పంపినట్లు తెలుస్తోంది.
నల్లగొండ జిల్లా మునుగోడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 4న) ఎన్నికల ప్రచారానికి నాంపల్లి మండలం తుంగపాడ్కు వెళ్లిన రాజగోపాల్రెడ్డిని ప్రజలు అడ్డుకున్నారు. ఎంపీగా చేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉండి తమకు చేసిన అభివృద్ధిని చెప్పాలని నిలదీశారు.
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చావని ప్రశ్నించిన గ్రామస్తులు, ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పారు. దీంతో తమ నేతను అడ్డుకుంటావా అని కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకురావడంతో, గ్రామస్తులు కూడా తగ్గకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు సమాచారం. పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పి రాజగోపాల్రెడ్డిని అక్కడి నుంచి సురక్షితంగా పంపినట్లు తెలుస్తోంది.