యాప్నగరం

Telangana Elections: కేసీఆర్ జాతకాల పిచ్చితో మాకే లాభం - విజయశాంతి

రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి పునాదులపై కూర్చొని పాలన చేస్తూ కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు.

Samayam Telugu 3 Dec 2018, 3:39 pm
తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జాతకాల పిచ్చి ప్రజా కూటమికి ఎంతో మేలు చేస్తుందని నటి, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లా సుల్తాన్‌పూర్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన రోడ్‌ షోలో ఆమె పాల్గొన్నారు. కేసీఆర్‌ జాతకాల పిచ్చితోనే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చాయని.. కొన్ని నెలల ముందుగానే తమకు అధికారం దక్కించుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. డిసెంబర్‌ 7న జరగనున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజల ఓటు ప్రజాకూటమికేనని చెప్పారు.
Samayam Telugu Vijayashanti


‘డిసెంబర్‌ 11వ తేదీ తర్వాత మనకు మంచి రోజులు వస్తాయి. తెలంగాణలో రాక్షసపాలన అంతమై కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుంది. ఉద్యమం సమయంలో ఉన్న కేసీఆర్‌ వేరని.. సీఎం అయ్యాక కేసీఆర్‌ కళ్లు నెత్తికెక్కాయి. 4 కోట్ల రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారు. రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి పునాదులపై కూర్చొని పాలన చేస్తూ కేసీఆర్‌ రాజకీయాలు చేస్తున్నారని’ విజయశాంతి మండిపడ్డారు. స్టార్‌ క్యాంపెయినర్‌ బాధ్యతల నిర్వహణలో భాగంగా లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.