యాప్నగరం

Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డికి షాక్.. ఫలితాలు చూసి సొమ్మసిల్లిన నేత

తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చుక్కెదురైంది. ఫలితాల తీరు చూసి ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.

Samayam Telugu 11 Dec 2018, 7:09 pm
సెంబ్లీ ఎన్నికల ఫలితాల తీరు చూసి కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి షాక్‌కు గురయ్యారు. ఫలితాలు వన్‌సైడ్‌గా వస్తుండటంతో సొమ్మసిల్లి పడిపోయారు. బీపీ పెరగడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఆయణ్ని వెంటనే జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్గొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
Samayam Telugu Komati Reddy


టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి 20,504 ఓట్ల మెజార్టీతో కోమటి రెడ్డిపై గెలుపొందారు. అయితే.. మునుగోడు నుంచి ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపొందడం ఊరటనిచ్చే అంశం..

నల్గొండ నియోజకవర్గం నుంచి ఏళ్లుగా గెలుపొందుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇది చేదు అనుభవమే. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఆయన తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో ఆయన 10 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. అయితే.. గతంలో కంచర్ల భూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 50 వేల ఓట్లు సాధించడం గమనార్హం.

ఈసారి టీఆర్‌ఎస్ తరఫున బరిలోకి దిగడం కంచర్లకు కలిసొచ్చింది. నల్గొండకు మెడికల్ కాలేజీ సాధన, బత్తాయి మార్కెట్ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కంచర్లకు అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది.

Also Read: టీఆర్‌ఎస్ విజయానికి ప్రధాన కారణాలివే..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.