యాప్నగరం

కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ కోవర్టులున్నారు.. త్వరలో పేర్లు బయటపెడతా: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్‌లో కమిటీల చిచ్చు.. పదవులపై సీనియర్ నేతల అసంతృప్తి..

Samayam Telugu 20 Sep 2018, 2:04 pm
ముందస్తు ఎన్నికలకు సై అంటోన్న తెలంగాణ కాంగ్రెస్.. కమిటీలు ప్రకటించి దూకుడు పెంచింది. కమిటీల ప్రకటన తర్వాత గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్న పార్టీకి.. అప్పుడే అసంతృప్తుల సెగ మొదలయ్యింది. సీనియర్ నేత వీ హనుమంతరావుతో పాటూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు షాకిచ్చారు. సరైన పదవులు దక్కలేదని వీహెచ్ అంటుంటే.. తనకు ఎలాంటి పదవి వద్దూ.. సాధారణ కార్యకర్తగానే ఉంటానంటూ సుధీర్ రెడ్డి పెద్ద బాంబ్ పేల్చారు.
Samayam Telugu Vh


ప్రచారక కమిటీ పదవి ఆశించిన వీహెచ్.. ఆ పదవి దక్కకపోవడంతో పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రచార కమిటీ నుంచి పక్కన పెట్టడం కంటే తనను చంచల్ గూడ జైల్లో పెడితే బాగుండేదని వ్యాఖ్యానించారు. తమ పార్టీలోనే కొందరు కోవర్టులున్నారని.. కేసీఆర్‌తో రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు. తనకు పదవి వస్తే.. టీఆర్ఎస్‌ను ఓడిస్తాననే వాళ్ల భయమన్నారు. త్వరలోనే వాళ్ల పేర్లను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అందజేస్తానన్నారు వీహెచ్.

ఇటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా పార్టీకి షాకిచ్చారు. పీసీసీ ఎన్నికల కమిటీలో కొనసాగలేనని.. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నారు. 35 ఏళ్లగా పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేస్తున్నానని.. ఇప్పుడు కూడా సాధారణ కార్యకర్తగానే కొనసాగుతానన్నారు. సుధీర్ రెడ్డి పదవి పట్ల అసంతృప్తితో ఉన్నారా.. మరేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.