యాప్నగరం

Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ నిషేధం

ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది.

Samayam Telugu 10 Nov 2018, 7:02 pm
ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై భారత ఎన్నికల సంఘం (సీఈఐ) నిషేధం విధించింది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనుండగా, ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ పోలింగ్ ఈ నెల 12వ తేదీన జరగనుంది. నవంబర్ 20న రెండో దశ పోలింగ్ నిర్వహిస్తారు. డిసెంబర్ 7న తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలతో ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తవుతాయి.
Samayam Telugu ECI


ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 12వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి డిసెంబర్‌ 7వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 126ఏ సబ్ సెక్షన్(1) ప్రకారం నిర్దేశిత సమయంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఎలాంటి సర్వేల వివరాలు ప్రసారం చేయవద్దని, ప్రచురించవద్దని ఎన్నికల సంఘం ఉత్తర్వులలో పేర్కొంది. రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం (నవంబర్ 11న) నోటిఫికేషన్ విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.