యాప్నగరం

Telangana Elections: ఉత్తమ్‌పై కేసు నమోదు.. రేవంత్‌కు నోటీసులు

ఉత్తమ్, వీహెచ్‌పై కేసులు, వంటేరు, రేవంత్‌లకు నోటీసులు

Samayam Telugu 21 Nov 2018, 10:30 am
ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఎన్నికల సంఘం కేసు నమోదు చేసింది. ఆయనతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావుపై కేసు నమోదు చేసినట్లు సీఈవో రజత్ కుమార్ తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేశామని రజత్ కుమార్ వెల్లడించారు.
Samayam Telugu notice


సికింద్రాబాద్ వైఎంసీలో మతపరమైన సమావేశాలు నిర్వహించి ఓ వర్గం వారిని ప్రలోభపెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ఉత్తమ్ ఇచ్చిన వివరణను పరిశీలించి గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు.

వీహెచ్‌పై కార్వాన్, బహుదూర్ పురా ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేశామని, ఈ వ్యవహారంలో వీహెచ్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపతి చర్యలు ఉంటాయని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.