యాప్నగరం

కాంగ్రెస్ రెబల్‌గా మాజీ మంత్రి శంకర్రావు

కాంగ్రెస్‌కు షాకిచ్చిన మాజీ మంత్రి శంకర్రావు.. షాద్ నగర్ నుంచి రెబల్ అభ్యర్థిగా నామినేషన్..

Samayam Telugu 16 Nov 2018, 8:30 am
తెలంగాణ మహా కూటమి పార్టీలకు అసమ్మతి సెగ మొదలయ్యింది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగుతున్నారు. సొంత పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌కు మాజీ మంత్రి శంకర్రావు షాక్ ఇచ్చారు. షాద్‌నగర్ నుంచి రెబల్‌గా బరిలోకి దిగారు. గురువారం తన కుమార్తె సుస్మితతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేశానని.. నియోజకవర్గ ప్రజలు మరోసారి తనను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
Samayam Telugu sankar


షాద్‌నగర్ టికెట్‌పై శంకర్రావు ఆశలు పెట్టుకున్నారు. కాని కాంగ్రెస్‌ రెండో విడత జాబితాలో షాద్‌నగర్‌ టికెట్‌ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డికి దక్కింది. దీంతో రెబల్‌గా బరిలోకి దిగుతున్నట్లు శంకర్రావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా ఉన్నారు. షాద్‌నగర్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2009లో కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు. పార్టీ ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చింది.

2014 ఎన్నికల్లో శంకర్రావుకు అధిష్టానం టిక్కెట్ నిరాకరించడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు.. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మళ్లీ అనూహ్యంగా షాద్‌నగర్ బరిలో తాను ఉన్నానంటూ ముందుకొచ్చారు. ఏకంగా రెబల్‌గా నామినేషన్ కూడా దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.