యాప్నగరం

సెటిల్‌మెంట్లకు కేరాఫ్ కొండా దంపతులు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివారు: వినయ్ భాస్కర్

రాజకీయ పునర్జన్మ ఇచ్చిన టీఆర్ఎస్‌పై విమర్శలా.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చక్కగా చదివారు..

Samayam Telugu 25 Sep 2018, 2:27 pm
రాజకీయ పునర్జన్మ ఇచ్చిన కేసీఆర్‌పై కొండా దంపతులు విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. వరంగల్‌లో మాట్లాడిన ఆయన.. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. కొండా దంపతులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను సురేఖ చదివారన్నారు వినయ్. ఉద్యమకారులపై దౌర్జన్యాలు చేసినా.. కేసీఆర్ పెద్ద మనసుతో టిక్కెట్ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. సెటిల్‌మెంట్లకు కేరాఫ్ అడ్రస్ కొండా దంపతులని మండిపడ్డారు.
Samayam Telugu Vinay


మంత్రి కేటీఆర్‌, ఎంపీ కవితపైనా కొండా సురేఖ విమర్శలు చేయడం దారుణమన్నారు వినయ్ భాస్కర్. వారిద్దరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. ఆ సమయంలో ఆయనపై ఎన్నో కేసులు కూడా పెట్టారన్నారు. కొండాకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో వరంగల్ ఈస్ట్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ వచ్చాక కొండా దంపతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారడంతో.. వారి మేనల్లుడి ద్వారా తన దగ్గరకు వచ్చారన్నారు. కొండా సురేఖను కేటీఆర్‌ దగ్గరికి తాను తీసుకెళ్లినట్లు చెప్పుకొచ్చారు. కొండా మురళీ మళ్లీ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు వినయ్ భాస్కర్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.