యాప్నగరం

సొంత పార్టీలో మధుయాష్కీకి నిరసన సెగ.. కార్లు ధ్వంసం

మాజీ ఎంపీ మధుయాష్కీకి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసన సెగ.. డబ్బు పంచడానికి వచ్చారంటూ చుట్టుముట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు.. గందరగోళం.. కార్లు ధ్వంసం.

Samayam Telugu 6 Dec 2018, 11:11 pm
జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీకి నిరసన సెగ తాకింది. కోరుట్ల నియోజకవర్గం మెట్‌పల్లిలో ఓ ఇంటికి వెళ్లిన యాష్కీని సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మిరెడ్డి రాములకు టికెట్ రాకుండా మధు యాష్కీ కుట్రలు చేశారంటూ గొడవకు దిగారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆ ఇంటి ముందే బైఠాయించారు. భారీగా కార్యకర్తలు తరలిరావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Samayam Telugu madhu.


కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన కొనసాగుతుండగానే.. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. మధు యాష్కీ డబ్బు పంచేందుకే మెట్‌పల్లి వచ్చారంటూ వారు అక్కడే నిరసనకు దిగారు. ప్థానికుతేరుడైన యాష్కీకి ఇక్కడ ఏం పని అంటూ నిలదీశారు. రెండు పార్టీల కార్యకర్తలు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కొద్దిసేపటి తర్వాత యాష్కీ అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుసుకున్న కార్యకర్తలు.. ఆగ్రహంతో ఆయన కార్లను టార్గెట్ చేశారు.

ఇంటి బయట ఉన్న మధు యాష్కీ కార్ల అద్దాలను కార్యకర్తలు పగులగొట్టి ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ గొడవ గురించి తెలియగానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తల్ని అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.