నేడు (డిసెంబర్ 7న) జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు రంగాలు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొందరు సెలబ్రిటీలు ఓటు హక్కు ప్రాధాన్యతను గురించి ప్రచారం సైతం చేశారు. ఏ అభ్యర్థి నచ్చని పక్షంలో నోటా అనే ఆప్షన్ ఉందని దర్శక దిగ్గజం రాజమౌళి సూచించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నానని మెగా హీరో రామ్ చరణ్ నిరాశ చెందారట. దీనిపై తన ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు.
‘కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి’ అని #TelanganaElections2018 #GoandVote అనే హ్యాష్ ట్యాగ్తో ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కాగా, రామ్ చరణ్ తల్లిదండ్రులు, మెగా దంపతులు చిరంజీవి, సురేఖ తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.
అయితే చెర్రీ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మూవీ బిజీ షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా రామ్ చరణ్ అందుబాటులో లేడని సమాచారం. ఆ మూవీలో కియారా అద్వాణీ, రామ్ చరణ్కు జోడీగా నటిస్తోంది. మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్టుతోనూ చరణ్ బిజీగా ఉన్నారు.
‘కొన్ని అనివార్య కారణాల వల్ల నేను నా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నా. దయచేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయండి’ అని #TelanganaElections2018 #GoandVote అనే హ్యాష్ ట్యాగ్తో ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. కాగా, రామ్ చరణ్ తల్లిదండ్రులు, మెగా దంపతులు చిరంజీవి, సురేఖ తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.