యాప్నగరం

కోదండరాం ఢిల్లీకి గులాం అయ్యారు: హరీష్ రావు

ప్రొఫెసర్ కోదండరాం మహాకూటమిలో కలవడంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి హరీష్ రావు.

Samayam Telugu 12 Nov 2018, 7:12 pm
హాకూటమిలో భాగమైన తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంపై టీఆర్ఎస్ నేత, మంత్రి హరీశ్ రావు పలు ఆరోపణలు చేశారు. ఒకప్పుడు టీడీపీని తెలంగాణ ద్రోహి అన్న కోదండరాం ఇప్పుడు వారితో పొత్తు ఎలా పెట్టుకున్నారో చెప్పాలన్నారు. కేవలం నాలుగు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆయన ఢిల్లీకి, అమరావతికి గులాం అయ్యారని ఆరోపించారు.
Samayam Telugu Untitled1111


టీజేఎస్ నేతలు నగేశ్‌, పలువురు కార్యకర్తలు సోమవారం హరీశ్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కోదండరాం ఒకసారి పాత రోజులను గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లు ఆయన్ను లక్ష్యం చేసుకున్నాయని, వారి నుంచి కోదండరాంను కాపాడింది టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. నాడు ఎవరైతే తెలంగాణ జేఏసీని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నించారో వారికే కోదండరాం దగ్గరయ్యారన్నారు. కాంగ్రెస్ తాను గెలవలేని సీట్లను టీజేఎస్‌కు కట్టబెట్టిందని, రానున్న రోజుల్లో టీజేఎస్ ఖాళీ కావడం ఖాయమని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.