యాప్నగరం

ఈ నెల 12న తెలంగాణ ఓటర్ల జాబితా విడుదల చేసుకోవచ్చు: హైకోర్టు

నవంబర్ 12న ఓటర్ల జాబితా విడుదల చేసుకోవచ్చు.. బూత్‌వైజ్ ఓటర్ల జాబితాను కోర్టుకు సమర్పించాలి.. ఈ నెల 12న అఫిడివిట్ దాఖలు చేయండి..

Samayam Telugu 10 Oct 2018, 6:39 pm
తెలంగాణ ఓటర్ల జాబితా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 12న జాబితాను విడుదల చేసుకోవచ్చని తెలిపింది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ.. కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈసీ సోమవారం నాడు వేసిన కౌంటర్ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. పిటిషనర్ సమర్పించిన ఓటర్ జాబితాలో తప్పులు ఉన్నాయని.. 2016-17 లిస్ట్‌ను తీసుకొచ్చారని.. లిస్ట్‌లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేస్తామని ఈసీ తరపు లాయర్ వాదనలు వినిపించారు.
Samayam Telugu Voters List


కాంగ్రెస్ నేత మర్ర శశిధర్ రెడ్డి తరపు ప్రముఖ లాయర్ జంధ్యాల రవి శంకర్ వాదించారు. ఓటరు జాబితాలో ఒకే అడ్రస్‌తో వేల ఓట్లు ఉన్నాయని.. ఈసీ వెబ్‌సైట్‌ నుంచి తీసుకొచ్చిన లిస్ట్‌ను కోర్టుకు సమర్పించామన్నారు. అలాగే బోగస్ ఓట్లపైనా తన వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న చీఫ్ జస్టిస్.. ఓటరు జాబితాలో అభ్యంతరాలను నివృత్తి చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తారో చెప్పాలంది. బూత్‌వైజ్ ఓటర్ల జాబితాను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓటర్ల జాబితాను 12న విడుదల చేసుకోవచ్చని తెలిపి.. తదుపరి విచారణను అదే రోజు (12-10-218)కు వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.